రాజస్థాన్ లో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనలో కన్న కొడుకులే తల్లి పై పైశాచిక దాడికి పాల్పడ్డారు. తన పేగుని తెంచి మరీ జన్మనిచ్చిన కన్నతల్లి కన్నా కనిపించిన పరువుకే ప్రాధాన్యతనిచ్చారు ఇద్దరు కొడుకులు. ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏమిటంటే మొగుడు చనిపోతే తన సమీప బంధువు తో అక్రమ సంబంధం పెట్టుకోవడం. రాజస్థాన్ లోని నాగూర్ జిల్లాకు చెందిన ఒక మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆమె తన సమీప బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం తెలిసిన కొడుకులు ఆమెను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ పది రోజుల క్రితం ఆమె తన ప్రియుడితో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలకు చిన్న బోయారో ఏమో కానీ ఇద్దరు కొడుకులు తీవ్రంగా ఆమె కోసం, తన ప్రియుడి కోసం గాలించారు. రెండు రోజుల క్రితం తల్లిని మరియు ఆమె ప్రియుడిని పట్టుకుని గ్రామానికి తీసుకువచ్చారు. పోయిన పరువును తిరిగి తెచ్చుకునేందుకు కన్నతల్లి జుట్టును మొదట కత్తిరించారు. 

అక్కడితో ఆగకుండా ఆమెను, తన ప్రియుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు కొడుకులిద్దరూ. దాని తర్వాత వారి ప్రవర్తన శృతి మించిపోయింది. అనంతరం ఆమె ప్రియుడి మూత్రాన్ని ఆమె ఆమె చేత తాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ అమానుష ఘటనను కొందరు గ్రామస్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీనిపై నాగౌర్ జిల్లా ఏఎస్పీ నితేష్ ఆర్య వెంటనే స్పందించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి బాధితురాలిని రక్షించారు. ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో ఉండగా తన ఫిర్యాదుపై కొడుకులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: