వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ తెలుగు దేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు స్పందిస్తూ తెలుగు దేశం పార్టీ దళితులను అవమానించిన తీరుని ప్రస్తావించారు. తెలుగు దేశం పార్టీ కాదని.. దళిత ద్రోహుల పార్టీ అని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.      


మొన్నటికి మొన్న దళితుల దగ్గర మాట్లాడుతూ దళితులనే అవమానించాడు తెలుగు దేశం పార్టీ అధినేత. ఎస్సిలుగా ఎవరు పుట్టాలనుకుంటారు చెప్పండి అంటూ అయన తరహాలో స్పీచ్ లో దళితులను అవమానించారు. నిన్నటికి నిన్న వర్ల రామయ్య మాట్లాడుతూ ఘోరాతి ఘోరంగా ఎస్సిలు అసలు చదవరు నా కొడుకులు అంటూ అనుచితంగా మాట్లాడాడు.      


ఇప్పుడు .. చలో ఆత్మకూరు అని ఊర్లో గొడవ చేయమంటే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిని ఘోరతో ఘోరంగా ''మీ దళితుల వల్లే ఈ దరిద్రం'' అంటూ అవమానించారు. ఇలా ఎప్పటికప్పుడు తెలుగు దేశం పార్టీ నేతలు దళితులను ఘోరాతి ఘోరంగా అవమానిస్తున్నారు. ఈ విషయంపైనే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ 'తెలుగుదేశం పార్టీ కాదని.. దళిత ద్రోహుల పార్టీ' అని అయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా అందరూ సమానులే అని అనుకునే ఈ కాలంలో రాజు అయి ఉంది రాజకీయ నాయకులకే ఇలాంటి అభిప్రాయాలూ ఉండటం ఘోరం.     


మరింత సమాచారం తెలుసుకోండి: