చంద్రబాబు నాయుడు రోజుకో విదంగా మాట్లాడుతూ శవరాజకీయాలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయన నీచ రాజకీయాలు చూడలేక ప్రజలు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే అతని రాజకీయం గురించి అతను మాట్లాడకుండా, అతని మాటల గురించి అతను ఆలోచించకుండా మరొకరి మాటలను పతివ్రత మాటలు అది ఇది అంటూ కామెంట్ చేస్తున్నాడు చంద్రన్న.                       


విషయానికి వస్తే.. నేడు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు .. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలు కూడా సమయం ఇవ్వకుండా అనవసరంగా విమర్శలు చేస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈరోజు మీడియా ముందు మాట్లాడిన అయన పోలవరంలో ఎందుకు మార్పులు జరిగాయని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రులు తెలివిలేని వారా అని ప్రశ్నించారు.                                 


వైఎస్ జగన్ ఏదో నీతిమంతుడుల మాట్లాడుతున్నాడు, జగన్‌ పతివ్రత, హానెస్ట్‌ పర్సన్‌ ఆ అంటూ మంది పడ్డారు చంద్రబాబు. ఇలా మాట్లాడిన చంద్రబాబు మాటలపై స్పందించిన నెటిజన్లు.. అవును మా జగన్ అన్న నీతి మంతుడు. నువ్వు నీతిమంతుడివా ? అని ఒకరు ప్రశ్నిస్తే.. మరొకరు కామెంట్ పెడుతూ.. ఏంటి బాబు నువ్వు ఏమైనా కరెక్ట్ ఆ ? బతికి ఉన్నంత కాలం ఆపాయిట్మెంట్ ఇవ్వని నువ్వు శవరాజకీయాలు చేసే నువ్వు జగన్ గురించి మాట్లాడుతున్నావా ? నువ్వు ఏమైనా పతివ్రతావా అంటూ చంద్రబాబుకి ఝలక్ ఇస్తున్నారు నెటిజన్లు.               

           

మరింత సమాచారం తెలుసుకోండి: