తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఎందుకంటే తిరుమల వారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏ క్షణాన చూసిన భక్తజనంతో ఈ ఆలయం కిక్కిరిసి పోతుంది. అయితే తిరుమల వారిని దర్శించుకునేందుకు బయలుదేరే భక్తులు మామూలుగా అయితే తమ వెంట  ఏం తీసుకెళ్తారు. దేవుడికి సమర్పించుకోవాలనుకునే   ఏదైనా కానుకలు ఉంటే కానుకలు తీసుకెళ్తారు. ఎంతో శుద్ధిగా ఉండి ఆ శ్రీవారి   దర్శనానికి బయలుదేరుతారు. కానీ దేవుని దగ్గరికి ఎవరైనా మద్యం తీసుకెళ్తారా . ఛి ఛి  దేవుని దగ్గరికి మద్యం ఏంటి అంటారా. కానీ ఇప్పుడు ఓ  ప్రబుద్ధుడు అదే చేసాడు. 

 

 

 తిరుమల వారి దేవస్థానం అంటే ఎంత ఫేమసో  అందరికీ తెలిసిందే. అందుకే ఆయన దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ఓ  భక్తుడు  వచ్చాడు. అయితే ఈ భక్తుడు తన వెంట వాటర్ బాటిల్ లో వోడ్కా ను కలిపి తీసుకొచ్చాడు.అయితే  అలిపిరి చెక్ పోస్ట్ వద్ద పోలీసుల కళ్లుగప్పి ఏకంగా మద్యం బాటిల్ ని కొండ మీదకి తీసుకు వచ్చేసాడు ఈ భక్తుడు. శ్రీవారి దర్శనం కోసం బయల్దేరిన ఇతను  ఎస్ఎన్జిహెచ్ రూమ్  నెంబర్ 28 లో మధ్యం బాటిల్ తో  పోలీసులకు దొరికిపోయాడు. దీంతో  అక్కడి విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే అదే రూమ్ లో ఉన్న మిగతా  భక్తులు ఈ ప్రబుద్దున్ని  చూసి ఆశ్చర్యపోయారు. దేవుని దర్శనానికి వచ్చి ఈ పాడు బుద్ధి ఏంటని అనుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: