తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఎందుకంటే తిరుమల వారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏ క్షణాన చూసిన భక్తజనంతో ఈ ఆలయం కిక్కిరిసి పోతుంది. అయితే తిరుమల వారిని దర్శించుకునేందుకు బయలుదేరే భక్తులు మామూలుగా అయితే తమ వెంట ఏం తీసుకెళ్తారు. దేవుడికి సమర్పించుకోవాలనుకునే ఏదైనా కానుకలు ఉంటే కానుకలు తీసుకెళ్తారు. ఎంతో శుద్ధిగా ఉండి ఆ శ్రీవారి దర్శనానికి బయలుదేరుతారు. కానీ దేవుని దగ్గరికి ఎవరైనా మద్యం తీసుకెళ్తారా . ఛి ఛి దేవుని దగ్గరికి మద్యం ఏంటి అంటారా. కానీ ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు అదే చేసాడు.
తిరుమల వారి దేవస్థానం అంటే ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. అందుకే ఆయన దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ఓ భక్తుడు వచ్చాడు. అయితే ఈ భక్తుడు తన వెంట వాటర్ బాటిల్ లో వోడ్కా ను కలిపి తీసుకొచ్చాడు.అయితే అలిపిరి చెక్ పోస్ట్ వద్ద పోలీసుల కళ్లుగప్పి ఏకంగా మద్యం బాటిల్ ని కొండ మీదకి తీసుకు వచ్చేసాడు ఈ భక్తుడు. శ్రీవారి దర్శనం కోసం బయల్దేరిన ఇతను ఎస్ఎన్జిహెచ్ రూమ్ నెంబర్ 28 లో మధ్యం బాటిల్ తో పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అక్కడి విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే అదే రూమ్ లో ఉన్న మిగతా భక్తులు ఈ ప్రబుద్దున్ని చూసి ఆశ్చర్యపోయారు. దేవుని దర్శనానికి వచ్చి ఈ పాడు బుద్ధి ఏంటని అనుకున్నారు.