జగన్ తన పాలనలో ఎటువంటి అవినీతి ఉండదని మొదటి రోజునే చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగా జగన్ నిర్ణయాలు ఉండటం గమనార్హం. జగన్ తమ ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు. అవినీతి లేని రాష్ట్రాన్ని మీరు చూడబోతున్నారని. దానికి తగ్గట్టుగానే మొదటి వంద రోజులు ఎటువంటి అవినీతి మంచి లేకుండా ప్రభుత్వాన్ని నడిపారు. ఇది జగన్ సాధించిన పెద్ద విజయంగా చెప్పుకోవాలి. అలాగే మొదటి వంద రోజులు జగన్ పరిపాలన చూశాక .. టీడీపీ ప్రభుత్వానికి .. వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో ఇట్టే చెప్పొచ్చు. మూడు నెలలో ఇచ్చిన హామీలను డేట్స్ చెప్పి మరీ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడినట్టు ఏ ఒక్క మంత్రి మీద గాని ఎమ్మెల్యే మీద గాని ఫిర్యాదు రాలేదు.


ఇది ఒక్కటి చాలు జగన్ విజయవంతం అయ్యాడని చెప్పడానికి. రాష్ట్రంలో  సీఎం ఒక్కరే బాగా పని చేస్తే సరిపోదు. మంత్రులు కూడా బాగా పని చేస్తేనే ప్రజల్లో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోని పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వంలో మంత్రుల పని తీరు బాగా ఉందని జగన్ కు నివేదిక వచ్చిందటా ! అయితే ఏపీ సీఎంగా జగన్ రాష్ట్రంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు.


ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ తీసుకువస్తున్నారు. అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు. తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. ఇప్పటికే ఒక సెటిల్ మెంట్ లో దొరికిపోయిన మంత్రిని హెచ్చరించారు. జగన్ మంత్రుల మీద నిఘా పెట్టడానికి ఇంటెలిజెంట్ వ్యవస్థను పటిష్టం చేసారు. దీనితో మంత్రులు అందరూ జాగ్రత్తగా పని చేసినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: