జనసేన అధినేత పవన్ కల్యాణ్...టీడీపీ అధినేత చంద్రబాబు పార్ట్నర్ అని మరోసారి రుజువు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు విమర్శలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి పవన్ కూడా రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అది కూడా చంద్రబాబు ఏ పాయింట్ మీద అయితే విమర్శ చేస్తున్నారో...పవన్ కూడా అదే పాయింట్ మీద జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.


ఇక తాజాగా చంద్రబాబు అండ్ కొ గ్రామ సచివాలయ పరీక్షల పేపర్ లీక్ అయిపోయిందని గగ్గోలు పెట్టేస్తున్నారు. టీడీపీ డబ్బా మీడియా ఆంధ్రజ్యోతి మొదట ఈ రచ్చని స్టార్ట్ చేసింది. దాన్ని టీడీపీ భుజాన్ని వేసుకుని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. అటు ఆంధ్ర‌జ్యోతిని జగన్ ప్రభుత్వం బ్యాన్ చేయడం పట్ల కూడా టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఇదే లైన్ ని పవన్ కల్యాణ్ కూడా గుడ్డిగా ఫాలో అవుతున్నారు.


ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయడం పట్ల రియాక్ట్ అయ్యి జగన్ ప్రభుత్వం తీరుని ఖండించిన పవన్... గ్రామ సచివాలయ ప్రశ్నా పత్రాలు లీకయ్యాయని ఇదే ఆంధ్ర జ్యోతి పేపర్, టీడీపీ ఇచ్చిన స్టేట్మెంట్ నే జనసేన పార్టీ అధికార సోషల్ మీడియా విభాగం పట్టుకొని జగన్ పై విమర్శలు చేసే ప్రయత్నం చేసింది.


ఇలా గుడ్డిగా చంద్రబాబుని ఫాలో అవుతూ...పవన్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని వైసీపీ ఫాలోవర్స్ తప్పుబడుతున్నారు. పవన్ మరోసారి చంద్రబాబు పార్ట్నర్ అని రుజువు చేసుకున్నారని విమర్శలు చేస్తున్నారు. అలాగే అంతకముందు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానెల్ ని చూడొద్దని చెప్పిన పవన్...ఇప్పుడు వాటి ఆధారంగానే జగన్ పై విమర్శలు చేయడాన్ని తప్పుబడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: