30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి... ఆయన ఏ సినిమాలో నటించిన  కామెడీ పంట పండాల్సిందే . ఏ సినిమాకి స్పూఫ్ చేయాలన్న కేర్ ఆఫ్ అడ్రెస్  30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి.  ఆయన కామెడీ స్టైల్ ఫుల్లీ  డిఫరెంట్. డిఫరెంట్ స్పూఫ్ లతో  ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడు పృద్వి . అయితే ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన ఎలక్షన్లలో  వైసీపీ పార్టీలో చేరి  జగన్ వెన్నంటే ఉన్నాడు పృథ్వి. అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీపై పలు విమర్శలు గుప్పించాడు పృథ్వి. దీంతో ఆయనకు అవకాశాలు  కరువయ్యాయి.

 

 

 జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం టాలీవుడ్ పెద్దలకి ఇష్టంలేదని అందుకే ఎవరు కూడా ముందుకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి కి అభినందనలు తెలిపలేదని పృథ్వి టాలీవుడ్ ఇండస్ట్రీ పై పలు విమర్శలు గుప్పించారు. దీంతో మెగా హీరోల సినిమాలోనే కాదు... మిగతా హీరోల సినిమాల్లో కూడా పృథ్వి కి అవకాశాలు కరువయ్యాయి. పృథ్వి చేసిన విమర్శల కారణంగా  అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్ లో  పృథ్వి కెరియర్ ముగిసినట్లే అనుకున్నారంతా. పృథ్వి వ్యాఖ్యల కారణంగానే అతనికి అవకాశాలు రావడంలేదని... వైసీపీ నేత నటుడు పోసాని  కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్ లు  అభిప్రాయపడ్డారు . 

 

 

 అయితే తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ మూవీ సైరా  నరసింహారెడ్డి సినిమాలో  పృథ్వీరాజ్ నటిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన సైరా  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రతి ఒక్కరు చిరంజీవిని పొగిడారు... కానీ పృథ్వీరాజ్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి ని ఆకాశానికి ఎత్తేశాడు. పృథ్వి మాటలు ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి. దీంతో పృథ్వి  తన తీరు మార్చుకున్నారని  భావిస్తున్నారు అంతా . అయితే పృథ్వి వ్యాఖ్యలతో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్... ఇటు మెగా ఫ్యామిలీ ని బాలెన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్టు   కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: