తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు జగన్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం 23 మంది ఎమ్మెల్యేల బలంతో చంద్రబాబు వైసీపీ సర్కార్ మీద అటాక్ చేస్తున్నారు. అయితే బాబు బలం ఎమ్మెల్యేలు కారని, అసలు బలం ఎక్కడ ఉందో వైసీపీ గుర్తించిందట. దానికి తగినట్లుగానే టార్గెట్ చేస్తూ ఏపీలో టీడీపీకి వణుకుపాట్లు, ఉనికిపాట్లు తేవాలని వైసీపీ గట్టి సంకల్పంతో ఉందని అంటున్నారు.


తెలుగుదేశం పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున నాయకుల బలం కూడా ఉంది. అందుకే ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినా బాబు ఒక్కటే మాట అంటూంటారు. నాయకులు పోతే పోనీ మళ్ళీ తయారు చేసుకుంటాం, మాది రాజకీయ నాయకులను తయారు చేసే కర్మాగారం అని అంటారు. అటువంటి టీడీపీలో పార్టీ నిర్మాణం మీదనే దెబ్బ కొట్టాలని వైసీపీ డిసైడ్ అయింది. అందుకే పై వరసలో  ఉన్న ఎమ్మెల్యేలను టచ్ చేయడం లేదు. ఆ విధంగా ఫిరాయింపులను చేశారన్న అపకీర్తి రాకుండా ఉంటుంది. అదే సమయంలో పార్టీ పునాదులను కదల్చడం ద్వారా అనుకున్న టార్గెట్ ని కూడా రీచ్ అవుతామని వైసీపీ భావిస్తోంది.


చంద్రబాబు దసరాల తరువాత జిల్లాల టూర్లను పెట్టుకున్నారు. బాబు ఎక్కడైతే జిల్లాల టూర్లు చేస్తారో అక్కడే తమ్ముళ్ళను పెద్ద సంఖ్యలో టీడీపీ నుంచి వైసీపీలోకి లాగేయడం ద్వారా బాబుకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయింది. బాబు బలమంతా ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా జిల్లాలే కావడంతో వైసీపీ ఈ జిల్లాల మీదనే ప్రత్యేక ద్రుష్టి పెట్టి టీడీపీ లీడర్లను, క్యాడర్ను కూడా తన వైపునకు తిప్పుకునేందుకు రంగం సిధ్ధం చేసింది. దసరా తరువాత ఏపీలో అసలైన రాజకీయ సయ్యాట మొదలవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: