మధ్యప్రదేశ్లో భారీ బ్లాక్ మెయిల్ కుంభకోణం బయటపడింది. ఈ భారీ సెక్స్ స్కాండ్లో ఎంతోమంది సెలబ్రిటీల వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 40 మంది కాల్ గర్ల్స్ తోపాటు పలువురు బాలీవుడ్ బీ గ్రేడ్ నటీమణులు.. అధికారులు, రాజకీయ నాయకులతో పాటు మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ కూడా ఈ బ్లాక్ మెయిల్ స్కాండల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భారీ బ్లాక్ మెయిలింగ్ సిండికెట్లో చిక్కుకున్న వీళ్లు ఇప్పుడు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
పైన చెప్పుకున్న టాప్ సెలబ్రిటీలు అందరూ ఆ మగువలతో గడిపినప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడు అటు అధికారులకు, ఇటు రాజకీయ నాయకులకు నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నాయి. మొత్తం వీరు ఆ మగువలతో ఎంజాయ్ చేసిన 92 హైక్వాలిటీ వీడియో క్లిప్స్ ఉన్నట్టు తేలడంతో సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ షమి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం ఈ హనీట్రాప్ బ్లాక్ మెయిలింగ్ కుంభకోణాన్ని ఛేదించింది.
మహిళలే ఈ రాకెట్ నిర్వాహకులుగా తేల్చగా... సేకరించిన వీడియోలు ఎక్కడ పెట్టారన్నదానిపై ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సెక్స్ రాకెట్ ప్రధాన నిర్వాహకురాలు శ్వేతా స్వప్నిల్ జైన్ను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వంలోని కీలక అధికారులు, రాజకీయ నాయకులే లక్ష్యంగా అద్దెకు తెచ్చిన కాల్ గర్ల్స్తో శ్వేతా జైన్ హనీట్రాప్ చేయిస్తున్నారని తేల్చారు. ఇక కొందరు ముంబై, ఢిల్లీకి చెందిన అధికారులకు డిమాండ్ను బట్టి మోడళ్లు, బాలీవుడ్ నటీమణులను వారి వద్దకు పంపారు. ఇక సిట్ సీజ్ చేసిన వీడియోల్లో కొందరు బీ గ్రేడ్ బాలీవుడ్ తారలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఓ ఐఏఎస్ అధికారి ద్వారా మంత్రులకు దగ్గర అయిన ఆమె వారికి కూడా పలువురు అమ్మాయిలను ఎరవేసి... వారు కార్యకలాపాలు కొనసాగిస్తోన్న టైంలో స్పై కెమేరాతో వీడియోలు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బు గుంజడం లేదా భారీ కాంట్రాక్టులు పొందడం చేస్తుంటామని స్వప్నిల్ జైన్ చెప్పినట్టు సమాచారం.