ఉల్లి ధరలు  ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కసారిగా ఉల్లి ధరకు  రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉల్లి కోయకుండానే ధరలతో సామాన్య ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తుంది ఉల్లి . కాగా  సామాన్య ప్రజలు మార్కెట్ కి వెళ్లి ఉల్లిని కొనాలంటేనే జంకుతున్నారు. కానీ రోజు వండే  ఆహారం లో ఉల్లి  కామన్ కాబట్టి కొనక తప్పడం లేదు. 

 

 

 

 అయితే తెలుగు రాష్ట్రాల్లో  40 రూపాయల నుంచి 50 రూపాయల పలుకుతున్న ఉల్లి ధర... దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 70 రూపాయలు పలుకుతుంది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉల్లి ధర భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో సామాన్యుల ఇబ్బందులను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి  ధర నుంచి ఢిల్లీ వాసులను రక్షించేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు . 

 

 

 ఈ నేపథ్యంలో ఢిల్లీలో కిలో ఉల్లిని  ధర 23.90 రూపాయలకే అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఒక్కొక్కరికి ఐదు కేజీల వరకు మాత్రమే ఉల్లి ని  అమ్ముతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో 60 నుంచి 80 రూపాయల వరకు ఉల్లి ధర పలుకుతుండగా  ఢిల్లీ ప్రజలకు 24 రూపాయలకే అందిస్తున్నామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా  రాబోయే ఐదు రోజుల్లో  ఒక లక్ష కిలోల ఉల్లిని కొనుగోలు చేస్తామని ... ఆ తర్వాత వాటిని ఢిల్లీ ప్రజలకు విక్రయిస్తామని తెలిపారు. కాగా  రేషన్ షాపుల ద్వారా మొబైల్ వ్యాన్ ల  ద్వారా ఉల్లి  అమ్మకాలు 24 రూపాయలకే జరుగుతాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో  సామాన్య ప్రజల ఇబ్బందులు దృశ్య కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: