వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 100 రోజులే పూర్తయింది.. మరి ఈ వంద రోజుల్లో మీరే సీఎం అయితే ఏమీ చేస్తారు.. నేనైతేనా.. పరిపాలనలో లోతుపాతులు తెలుసుకుంటాను.. అధికారులు ఎలా పనిచేస్తున్నారో చూస్తాను.. ఇంతకు ముందు పనిచేసిన పాలకులు ఎలా చేసారో అలా చేయాలని ప్రయత్నిస్తాను.. మరి ఈ సీఎం జగన్ ఏందీ ఇట్లా.. 100 రోజుల్లోనే ఎవ్వరికి అంతుబట్టని విధంగా పరిపాలన చేస్తున్నాడు. కేవలం నాలుగు నెలలన్నా కాలేదు.. అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నాడు.
ప్రతిపక్షాలు, మీడియా కావాలని దుర్మార్గమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగానే తన పనిని తాను కూల్గా చేసుకుంటూ పోతున్నాడు.. కళ్ళల్లో కారం పోసుకుని ఇగో ఏపీ సీఎం జగన్ నా కండ్లల్లో కారం కొట్టాడని ప్రతిపక్షాలు, మీడియా కావాలని రాద్ధాంతం చేస్తున్నా తన పనిమాత్రం ఆపడం లేదు.. వారి కండ్లల్లో నలుసుగా మారిపోయాడు. జగన్ చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు కేవలం ఒక వర్గం కోసం చేస్తున్న పనుల్లా లేవు.. ఏదో నిపుణుడైన సీఎం చేస్తున్నంతగా ఉన్నాయి.. ఎంత మంచి పథకాలు అంటే.. చెప్పలేని విధంగా ఉంటున్నాయి.
ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇంత మంచివాడైతే ఎలా.. మంచి వాడైతే పర్వాలేదు కానీ.. మరి ఇంత మంచివాడైతే ఆయన్ని తట్టుకునేది ఎట్టా అని ప్రతిపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నా పట్టనట్టుగానే ముందుకు సాగుతున్నాడు సీఎం జగన్. అయితే ప్రతిపక్షాలు ఎంత గగ్గొలు పెడుతున్నాడో అంత మంచి పథకాలు ప్రవేశపెడుతూ పచ్చపార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.. ఇప్పుడు సీఎం జగన్ ప్రవేశపెడుతున్న కంటి వెలుగుతో ప్రజలకు కంటి వెలుగు.. ప్రతిపక్షాలకు కంట్లో నలుసు.. ఇది జగన్ వేసిన స్కెచ్..
ఈ కంటి వెలుగు తెలంగాణలో ఇప్పటికే విజయవంతం అయి.. టీ ఆర్ ఎస్ను రెండో సారి అధికారంలోకి తెచ్చింది.. కేసీఆర్ను రెండో సారి ముఖ్యమంత్రిని చేసింది. అదే పథకాన్ని ఏపీ ప్రజలకు అందిస్తే వారి కంటికి వెలుగు వస్తుందనే మంచి ఉద్దేశంతో జగన్ కంటివెలుగు పథకానికి వైఎస్సార్ కంటి వెలుగు గా నామకరణం చేసి, వచ్చే నెల 10వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఐదు కోట్ల 30 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇది పెద్ద లక్ష్యమే. వీరందరికీ ఆధునిక పరీక్షలు చేసి అవరమైన వారికి అద్దాలు పంపిణి చేయడం, కొందరికి ఆపరేషన్లు చేయడం ఈ పథకం లక్ష్యం.
ఏపీలో ఉన్న జనాభా అంతటికి ఈ కంటివెలుగు పరీక్షలు నిర్వహిస్తారన్న మాట. అంటే ఇందులో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రాలు కూడా ఉన్నారన్నమాట. అంటే ఏపీ సీఎం ప్రవేశపెడుతున్న కంటివెలుగు పథకంలో చంద్రాలు కూడా ఓ లబ్ధిదారుడే.. ఇక టీడీపీ కార్యకర్తలకు ఈ కంటివెలుగు ఓ వరంగా మారగా.. దీంతో కళ్లకు అద్దాలు వస్తే ఆ అద్దాల నుంచి సీఎం కనిపించడం చంద్రాలు మాయం కావడం ఖాయం.. సో సీఎం జగన్ చేపట్టబోతున్న కంటి వెలుగు పథకంతో టీడీపీ లోని కొందరికి కళ్ళకు కమ్ముకున్న మబ్బులు తొలిగిపోతాయి.. ఏదేమైనా సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకం విజయవంతం అయితే.. ఇక ఆయనకు తిరుగే ఉండదు.. చంద్రాలకు పుట్టగతులే ఉండవు..