గతంలో ప్రియాంక చోప్రాకు మొదటి స్థానం దక్కగా. ఇక తర్వాతి స్థానంలో దీపికా పదుకొనే నిలిచింది. మూడో స్థానంలో సన్నీ లియోన్, నాలుగో స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఐదో స్థానంలో వర్తికా సింగ్, ఆరో స్థానంలో సౌత్ భామ శ్రేయ శరణ్ నిలచింది. శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, అమీ జాక్సన్, కంగానా రనౌత్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
మిస్ ఇండియా 2015 గా ఢిల్లీ చెందిన అదితి ఆర్య ఎంపికైంది. ముంబయిలోని యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన తుది పోటీల్లో అదితి ప్రధమ స్థానంలో నిలవగా అఫ్రిన్ వాజ్, వర్తికా సింగ్ లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పలువురు బాలీవుడ్ నటీనటులు, ప్రముఖ డిజైనర్ లు కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ ప్రైవేటు సంస్థలో రీసెర్చ్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్న అదితి మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఎఫ్బీబీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ - 2015' పోటీలలో ఢిల్లీ భామ అదితి ఆర్య విజేతగా నిలిచింది. యష్రాజ్ స్టూడియోలో కన్నుల పండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో అదితి ఆర్య 'మిస్ ఇండియా వరల్డ్' కిరీటాన్ని గెలుచుకుంది.