రోజులు మారుతున్న కొద్దీ డాక్టర్లు వైద్యం చేసే విధానం కూడా మారుతుంది. ఒకప్పుడు పాషన్ షన్ కోసం వైద్యులు పనిచేసేవారు... కానీ ఇప్పుడు వైద్యులు పైసల కోసం పనిచేస్తున్నారు. ఫ్యాషన్ వద్దు పైసలే ముద్దు అంటున్నారు. పైసల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ప్రాణం పోసే వైద్యలను  ప్రజలందరూ దేవుడు  అనుకుంతుంటే...నిలోఫర్  వైద్యులు మాత్రం దేవుళ్లు కాదు రాక్షసుల కంటే హీనంగా ఉన్నారు. 

 

 

 

పైసల కోసం కక్కుర్తి పడి ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యులు నిర్వాకం చూస్తే ప్రస్తుతం వైద్యులు ఎంత మెరుగైన వైద్యం అందిస్తున్నారో  అర్థమవుతుంది. ధనార్జనే మూలంగా వైద్య వృత్తి లోకి వస్తున్న  వైద్యులు ధనార్జన కోసం ఎంతటి దాష్టీకానికి అయినా వెనుకాడడం లేదు. చివరికి అభంశుభం తెలియని చిన్న పిల్లల ప్రాణాలను బలి తీసుకోవడానికి కూడా కనీస జాలి  చూపించడం లేదు. 

 

 

 

 కొత్తగా తయారైన మందుల పనితీరును తెలుసుకోవడానికి నిలోఫర్ వైద్యులు వాటిని చిన్నపిల్లలపై ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది చిన్న పిల్లలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో ఎంతో  తల్లిదండ్రులకి కడుపుకోత మిగులుస్తున్నారు నిలోఫర్ వైద్యులు . కాసులకు కక్కుర్తి పడుతున్న ఇలాంటి వైద్యుల వల్ల ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాల పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వైద్యులు వల్ల ఇంకా ఎంతో మందికి ప్రాణాలకి ముప్పు ఉంది . కాసుల కక్కుర్తితో రాక్షసులుగా మారుతున్న నిలోఫర్ వైద్యుల తీరు పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: