మగాళ్లు పూర్తిగా మానవత్వాన్ని రోజు రోజుకు మరచిపోతున్నారు.ఒంట్లో సలసలమని కాగుతూ పొగలు చిమ్మే కామసెగలతో రగిలిపోతున్నారు.పశువులకన్న హీనంగా మారి. పసిపిల్లలు అనే జాలి లేకుండా అత్యాచారాలకు ఎగబడుతున్నారు.ఇది పూర్తిగా వారి మానసిక స్దితిని సరిగ్గా లేదని చూపిస్తుంది.చట్టం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఈ అరాచకాలకు అంతం లేకుండా పోతుంది.ఆడపిల్ల బయటకు వెళ్లాలంటే బయపడే రోజులు మళ్లీ వస్తున్నాయి.



దుర్మార్గులు మనముందే నక్కలాగా కాపు కాస్తున్నారు.ఎదురింట్లోనో.పక్కింట్లోనో,బంధువులల్లోనో ఈ రాక్షస ప్రవృత్తి గలవారు వున్నారు కాని బయటికి మాత్రం కనిపించరు.వారిని నమ్మి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నామా,మనయింట్లో ఉన్న ఆడపిల్ల అన్యాయమైపోతుంది.వారి బ్రతుకు చిద్రమైపోతుంది.ఇలాంటి కామాంధుడి బారినుండి ఓ పదేళ్ల బాలిక తృటిలో తప్పించుకుంది.ఇక వివరాల్లోకి వెళ్లితే.గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబునాయుడు కాలనీలో నివసించే పసుపులేటి దుర్గాప్రసాద్‌కు 16 ఏళ్ల క్రితం వివాహమైనా పిల్లలు కలగలేదు.అతని వేధింపుల కారణంగా భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.



ఇక వెదురుబొంగుల నిచ్చెనలు తయారుచేసి,విక్రయించడం,స్థానికంగా కొద్దిమొత్తాలు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాడు.అంతవరకు బాగానే వుంది.ఒంటరిగా వుంటున్న అతనిలోకి కామ పిశాచి ప్రవేశించి.ఇంటి సమీపంలోని బాలికలను పిలిచి ఫోన్‌లో వారికి ఆ చిత్రాలను చూపించే సైకోలా మారాడు.ఈ విషయంలో ఓ సారి అతనికి లగ్గం నాగెళ్లి కూడా స్దానికులు చేసారు.అయినా అతనిలో మార్పు కలుగలేదు.మళ్లీ తాజాగా ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపాడు మృగాడు.చిన్నారి భయపడి, రోదిస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పుకుంది.ఆమె వచ్చి స్థానికులతో కలిసి దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది.ఇక,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఇతనికి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూడడం వ్యసనంగా మారిందని.ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే ముందు ముందు ఇంకా ప్రమాదం.కాబట్టి ఇతని పై తగిన చర్యలు తీసుకుని మరో సారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని స్దానికులు కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: