మన దేశంలో జరిగే పరువు హత్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ కసాయి తండ్రి అనుమానంతో కన్న కూతురినే గొంతు కోసి దారుణంగా చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. అనుమానం పెనుభూతమై కన్న తండ్రే కుమార్తెను దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగింది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం గుండురిబడి గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఆగస్టు 25న కనిపించకుండా పోయింది. 


తల్లిదండ్రులు తమ కులం కానీ వ్యక్తితో బాలిక వెళ్లిపోయి ఉంటుందని అనుమానించి వెతికారు. కానీ బాలికకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. దీంతో బాలిక ఈ నెల 15న తిరిగి ఇంటికి వచ్చింది. అయితే తండ్రి ఆమెను ఇంట్లోకి రావడానికి అనుమతించలేదు. దీంతో బాలిక దగ్గర్లోని బంధువు ఇంటికి వెళ్లింది. రెండు రోజుల తరువాత ఆయన బాలిక తండ్రిని తన ఇంటికి పిలిపించి ఆ బాలికను ఇంటికి తీసుకుని వెళ్లేందుకు ఒప్పించాడు. 


అయితే బంధువు, తండ్రి కలిసి బాలిక వెళ్లిన వ్యక్తి వివరాలు అడిగారు. కానీ బాలిక ఆ వ్యక్తి వివరాలు చెప్పలేదు. అయితే తండ్రి ఇంటికి తీసుకెళ్లే మార్గం మధ్యలో కూడా బాలిక తండ్రి బాలికను ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని ఒత్తిడి చెయ్యగా అప్పటికి ఆ బాలిక నోరు తెరవకపోవడంతో బాలికను గట్టిగా కొట్టి గొంతు కోసి చంపేసి ఆపై మృతదేహన్ని జాతీయ రహదారి పక్కన ఉన్న పొదల్లో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. 


అయితే రహదారి పక్కన మృతదేహన్ని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలిక కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు అనుమానించి విచారించగా జరిగిన విషయాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో నిందితుణ్ని అరెస్ట్‌ చేసి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: