ఆర్జేడి అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు ఏంటో కానీ ఎప్పుడు అతను, అతని కుటుంబం వివాదాల్లోనే ఉంటుంది. మొన్నటికి మొన్న లోక్ సభ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఆ పార్టీ ఓడిపోయింది. ఓ వైపు లాలూ కుమారుడు రాజకీయంగా విమర్శలు ఎదురుకొంటున్నాడు. ఇప్పుడు కుటుంబంలో వివాదాలు చోటుచేసుకున్నాయి.            


గతంలోనే లాలూ prasad NUVVILAA' target='_blank' title='click here to read more'>ప్రసాద్ పెద్ద కోడలు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సతీమణి ఐశ్వర్య చేసిన ఆరోపణలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో రకమైన ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళ్తే .. ఐశ్వర్య మాట్లాడుతూ అత్తింటివారు మూడు నెలలుగా తనకు భోజనం పెట్టడం లేదని తనను వంటింట్లోకి కూడా రానివ్వలేదని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించారని అత్త రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతిపై ఆమె విమర్శలు చేసారు.         


అయితే భార్యతో విడాకులు కోరుతూ తేజ్‌ప్రతాప్‌ ఆరునెలల క్రితం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె కాపురం నిలబెట్టుకోవాలని అత్తింటి వారు ఎన్ని భాదలు పెట్టిన ఉంటుంది. అయితే ఆమె అత్తింటి వారి వేధింపులు భరించలేకా పోతుంది అని, కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా వంటగదికి తాళాలు వేస్తున్నారని ఆమె ఆరోపించారు.                            


తన భర్త, మరిది వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆడపడుచు మీసా భారతి వల్లే తనకు సమస్యలు ఉన్నాయని ఐశ్వర్య ఆరోపించారు. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువు అవుతే లాలూ భార్య కూడా లాలూ దగ్గరకు వెళ్లాల్సిందే.                      

           

మరింత సమాచారం తెలుసుకోండి: