వరుణ్ తేజ్ హీరోగా హరీష్
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేష్(వాల్మీకి). సెప్టెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమాకు రిలీజ్ రోజు హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 20 కోట్ల రూపాయల
ప్రీ రిలీజ్
బిజినెస్ చేయగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 25 కోట్ల రూపాయల
ప్రీ రిలీజ్
బిజినెస్ చేసింది. పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
దాదాపుగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అయింది. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం రాలేదు. మిగతా ఏరియాల్లో కూడా గద్దలకొండ గణేష్ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ కెరీర్లో గద్దలకొండ గణేష్ సినిమాతో మరో హిట్ చేరింది. మరో రెండు రోజుల్లో సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల కాబోతుంది.
భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ తో సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలవుతూ ఉండటంతో గద్దలకొండ గణేష్ సినిమా థియేటర్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ సినిమా షేర్ కలెక్షన్లు కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. సైరా నరసింహారెడ్డి సినిమాకు ఇప్పటికే అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. మొదటి మూడు రోజుల వరకు ఈ సినిమా టికెట్లు దొరకటం అంత తేలిక కాదని తెలుస్తుంది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై చాలా వివాదాలు చుట్టుముట్టినా ప్రస్తుతం ఈ వివాదాలన్నీ పరిష్కారం అయ్యాయని తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాను 270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
నయనతార, తమన్నా,
అమితాబ్ బచ్చన్,
విజయ్ సేతుపతి,
సుదీప్,
అనుష్క ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. సైరా సినిమా భారీగా విడుదల అవుతూ ఉండటంతో గద్దలకొండ గణేష్ సినిమా కథ రేపటితో ముగిసినట్లే అని చెప్పవచ్చు.