అక్టోబరు 1నుంచి అంటే ఈ రోజు నుండే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో మార్పులు జరగనున్నాయి.స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా..రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక చేసుకుని అమలు చేస్తారు. దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు అక్టోబరు 3నుంచి 7 దాకా ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్ కేవీ నాంచారయ్య తెలిపారు.



ఈ సందర్భంగా సోమవారం విజయవాడలో ఇండియన్ బ్యాంకు జోనల్ మనేజర్ మణిమాల,ఎస్‌బీఐ ఏజీఎం డీజే ప్రసాద్,ఆంధ్రా బ్యాంకు డీజీఎం వెంకటేశ్వర స్వామి, ఎస్ఎల్‌బీసీ ఏజీఎం కె అజయ్‌పాల్ తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ,జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి సంప్రదింపుల సమితిలో చర్చించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి పంపిన తర్వాత వారి ఆమోదంతో ఈ పనివేళలు అమలు చేస్తామని,తెలిపారు.



ఇక అకౌంట్ హోల్డర్లు సిబిల్ స్కోరు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని.ఇందులో రైతులకు కూడా మినహాయింపు లేదని.ప్రకృతి వైపరీత్యాలు,రుణాల రీషెడ్యూల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని స్దానిక బ్యాంకు మేనేజర్లు సానుకూల నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.ఇక భారత బ్యాంకర్ల సంఘం(ఐబీఏ) సూచనల మేరకు కొత్తగా ప్రవేశ పెట్టే బ్యాంక్ పనివేళలు మూడు రకాలుగా రూపొందించారు.ఒకవేళ బ్యాంకు పనివేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్ణయిస్తే,మధ్యాహ్నం 2.00-2.30 గంటల మధ్య బ్యాంకు ఉద్యోగులకు భోజన విరామం ఉంటుంది.అదే సమయంలో,ప్రతి ఆదివారం,రెండు,నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందిని తెలిపారు.అధికారులు ప్రవేశ పెట్టిన పని వేళలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.



1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ
2 ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకూ
3 ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 5గంటల వరకూ  


మరింత సమాచారం తెలుసుకోండి: