ఆంధ్ర ప్రదేశ్ నేటి నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 11వేల 158 గ్రామ, 3వేల 786 వార్డు సచివాలయాలను ప్రభుత్వం  ఏర్పాటు చేసింది. ఒక్కో చోట 12 మంది వరకూ ఉద్యోగులను నియమించింది. గ్రామ, వార్డు కార్యదర్శులు, మహిళా పోలీసు, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య శాఖలకు చెందిన సిబ్బంది సచివాలయాల్లో సేవలను అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షా 26వేల 728 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించారు. ఎంపికైన వారందరికీ నియామక పత్రాలను ఇప్పటికే అందించారు.


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హుల గడప వద్దకే అందించడమే  లక్ష్యంగా ముద్నుకు సాగుతుంది. అందులో భాగంగా ప్రభుత్వం ఈ  వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చింది. గ్రామాల పునర్నిర్మాణం, నగరాల పౌరసేవల మెరుగుదలలో వీరు ఉపయోగపడనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు విధులను అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ నిర్దేశిత గ్రామాల్లో నిరంతరం అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయల్దేరి.. కాకినాడ సమీపంలోని కరప గ్రామానికి  సీఎం వై ఎస్ జగన్  చేరుకో నున్నారు.



అక్కడ గ్రామ సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా నిర్మించిన పైలాన్‌ ను  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం సీఎం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను, ముఖ్యంగా  సభా ప్రాంగణాన్ని అధికారులతో కలిసి మంత్రులు కన్నబాబు, విశ్వరూప్‌ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయాలకు కావాల్సిన సామగ్రిని అధికారులు ఇప్పటికే చేరవేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: