ఈ కాలంలో అంగట్లో దొరికే సరకులు ఏంటంటే ఇంటి వంట సామానులే గాక అమ్మాయులు అని టక్కున చెప్పే స్ధాయికి దిగజారింది ఈ లోకం.అందుకేనేమో ఆమ్మాయి శీలం ఇప్పుడు అతి చౌకబారుగా మారింది.ఎక్కడ చూడు ఏదో ఒక సాకు చెప్పి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు.మరికొందరైతే ఓ అడుగు ముందుకేసి ఆన్‌లైన్లో తమ శీలాలు అమ్ముకుంటున్నారు. శరీరాలతో చేసే ఈ వ్యాపారాన్ని కొంతకాలం పోతే వ్యభిచారం అనకుండా మరో పేరుతో పిలుస్తారేమో..



ఇక వస్తువూలకు రేటు కట్టినట్లుగా అమ్మాయిలకో రేటుపెట్టి తమ దందాలను కొందరు అక్కడక్కడ యదేచ్చగా కొనసాగిస్తు న్నారు.వీటికి అడ్డాలుగా పెద్దపెద్ద నగరాలు మారుతున్నాయి.ఇన్ని రూల్స్,కట్టుదిట్టమైన పోలీస్ పెట్రోలింగ్,అకస్మిక దాడులు కూడా వారిని నిలువరించ లేకున్నాయి.ఇక హైదరాబాద్,ముంబాయ్,ఢిల్లీ,కలకత్తా లాంటి నగరాల్లో ఐతే ఇటువంటి అసాంఘిక చర్యలకు తావే లేదు.ఇక దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మసాజ్ పార్లర్లలో వ్యభిచారం దందా జోరుగా సాగుతోంది.మసాజ్ పార్లర్ పేరిట దందా పెట్టి అమ్మాయిలతో గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్న ముఠా బాగోతాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ బట్టబయలు చేసింది..



ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నేతృత్వంలోని ఓ బృందం ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని మసాజ్ పార్లర్ పై ఆకస్మిక దాడులు చేసింది.ఈ దాడుల్లో మసాజ్ పార్లర్‌లో కండోమ్‌లతో పాటు అమ్మాయిల పేరిట రేట్ కార్డులు లభించాయి. అంతేకాకుండా యువతుల అశ్లీల ఫోటోలతో పాటు వారి రేటు ఎంత అనేది పేర్కొంటూ రేట్ కార్డులు మసాజ్ పార్లర్‌లో లభించడం అక్కడ ఎంతో సంచలనం రేపింది.



అయితే ఈ మసాజ్ పార్లర్ నుంచి గతంలోనూ నలుగురు అమ్మాయిలను మహిళా కమిషన్ కాపాడిందట.ఇవేగాక పశ్చిమ ఢిల్లీలోని ద్వారక,ఇతర ప్రాంతాల్లోని మసాజ్ పార్లర్లు,స్పాలపై మహిళా కమిషన్ బృందం చేసిన ఆకస్మిక దాడుల్లో వ్యభిచారం రాకెట్ బాగోతం బయటపడిందట.ఇంకా ఇలాంటి దుకాణాలు ఎన్ని వున్నాయో అని ఇప్పుడక్కడంత జల్లడ పడుతున్నారట పోలీసులు.ఇక ప్రస్తుతం దొరికిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసారట..

మరింత సమాచారం తెలుసుకోండి: