ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికార పగ్గాలు చేతపటిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా మున్సిపల్ కమీషనర్ అయిపోయారు. సాధారణంగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న నానుడి ఉంది. ఒక పక్క  పూజ్య బాపూజీ కన్న  కలలు సాకారం చేసే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేసింది. అది కూడా మహాత్మా గాంధీ జయంతి నాడు గ్రామ స్వరాజ్యాన్ని కాంక్షిస్తూ.. వార్డు సచివాలయం,  గ్రామ సచివాలయం వ్యవస్థలను ఆచరణలోకి తీసుకువచ్చారు. ఆయా సచివాలయ కార్యాలయాల  ప్రారంభోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరిగాయి. సందట్లో చడేమియా అన్న చందంగా మున్సిపల్ శాఖ  అధికారుల వైఖరికి ప్రజలు నవ్విపోయారు. పార్వతీపురంలో చోటుచేసుకున్న సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.


విజయనగరంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మున్సిపల్ కమిషనర్‌గా మార్చేశారు. పార్వతీపురం పురపాలక శాఖ తప్పిదం జనాలకు నవ్వులాటగా మారింది. వార్డు సచివాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టారు. అంతే కాకుండా ప్రత్యేక అధికారిగా ఎమ్మెల్యే జోగారావు ఫోటోను కూడా పెట్టారు. ఈ ఫ్లెక్సీని వార్డు సచివాలయం ముందు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్లెక్సీని చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. చివరి చేసిన పొరపాటుకు అధికారులు నాలుక్కరుచున్నారులెండి. తప్పిదం తెలసుకున్న అనంతరంమున్సిపల్ అధికారులు కంగారుపడిపోయారు.. ఆగమేఘాలమీద  ఫ్లెక్సీని తొలగించారు. ఈ సంగతి ఇలా ఉంటే జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పైన విమర్శలు గుప్పించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు గ్రామ సచివాలయం  ప్రారంభోత్సవం  కార్యక్రమంలో రాజోలు జనసేన ఎమ్మెల్యే  రాపాక పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  అన్ని విషయాలలోనూ  విఫలం చెందిందని విమర్శించారు.




గత ప్రభుత్వంలో ఎన్నడూలేని విధంగా విద్యుత్ కోతలు ఎదురవుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వంలో విద్యుత్ కోతల వల్ల   ప్రజలు  నానా అవస్థలు పడుతున్నారని.  విద్యుత్ కోతల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. విద్యార్థులు కిరోసిన్ దీపం  వద్ద చదువుకునే పరిస్థితులు దాపురించిందని విమర్శించారు. పట్టుదలకు పోకుండా పవన విద్యుత్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. తక్షణం ఇసుక సరఫరా అమలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వంలో ఇసుక దందా నడిచిందని ఈ ప్రభుత్వంలో అటువంటి దందాలను అరికట్టాలని సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: