ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన స్టార్ క్రీడాకారులు హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నాడు. బరోడా నుంచి ఒలింపిక్ పతక విజేత - స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్- పెహోవా నుంచి హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ - దాద్రి స్థానం నుంచి మహిళా రెజ్లర్ బబితా ఫొగట్ లను బీజేపీ గట్టి పోటీని నిలిపింది. అయితే హర్యానా రాష్ట్రంలో ఓ అసెంబ్లీ సీటు రూ. ఐదు కోట్లకు అమ్ముడు పోతుంది అని భారీ ఆరోపణలు సంచలనలు సుష్టిస్తుంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీగా నిలిచే అభ్యర్థుల విషయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మాట్లాడిన అనంతరం తొలి జాబితాను బీజేపీ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో 78 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలియచేసారు. 90 మంది ఎమ్మెల్యేలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 21న ఎన్నికలు ప్రారంభం అవుతున్నాయి. 38 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వగా ఏడుగురికి టిక్కెట్లు నిరాకరించినట్లు తెలిపింది అని బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నుంచి పోటీకి భరిలో దిగబోతున్నారు. ఇక ఏవరు నెగ్గుతారో చూడాలి మరి.