ఇక ఆ రాష్ట్రం ఐనా ఎన్నికల సమయంలో చాల ఆరోపణలు, చాల సంచలన పరిణామాలు సంబవిస్తుంటాయి.అలాగే హర్యానా లోకూడా ఎన్నికల సందర్భంగా  అనేకానేక చిత్రాలు - ఆరోపణలు - సంచలన పరిణామాలు  చోటుచేసు కుంది. దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధి యొక్క ఫలాలను అనుభవించే హర్యానా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి అందరికి తెలిసిందే కదా. 

ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన స్టార్ క్రీడాకారులు హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నాడు. బరోడా నుంచి ఒలింపిక్ పతక విజేత - స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్- పెహోవా నుంచి హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ - దాద్రి స్థానం నుంచి మహిళా రెజ్లర్ బబితా ఫొగట్ లను బీజేపీ గట్టి పోటీని  నిలిపింది. అయితే హర్యానా రాష్ట్రంలో ఓ అసెంబ్లీ సీటు రూ. ఐదు కోట్లకు అమ్ముడు పోతుంది అని భారీ ఆరోపణలు సంచలనలు సుష్టిస్తుంది.

అధికార బీజేపీలో టికెట్ల ప్రక్రియ సాఫీగా సాగగా...ప్రతిపక్ష హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఎవరు ఊహించని వివాదాన్ని తెరమీదకు తీసుకొని వచ్చింది. 
సోహ్న అసెంబ్లీ స్థానం రూ.5 కోట్లకు అమ్ముడుపోయిందని న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట తన అనుచరులతో కలిసి నిరసన కూడా చేశారు. టికెట్ల కేటాయింపు న్యాయబద్దంగా లేకపోతే బరిలో దిగిన అభ్యర్థులు ఏ విధంగా గెలుస్తారు ఆయన వాళ్ళు ప్రశ్నించా సాగారు. కొత్తగా పార్టీలో అడుగుపెట్టిన వారికీ టికెట్లు ఎందుకు ఇచ్చారని - రూ.5 కోట్లకు టికెట్లు అమ్ముడకపోయారా అని తన్వీర్ ఆరోపించారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీగా నిలిచే అభ్యర్థుల విషయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మాట్లాడిన అనంతరం తొలి జాబితాను బీజేపీ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో 78 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలియచేసారు. 90 మంది ఎమ్మెల్యేలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 21న ఎన్నికలు ప్రారంభం అవుతున్నాయి. 38 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వగా ఏడుగురికి టిక్కెట్లు నిరాకరించినట్లు తెలిపింది అని బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నుంచి పోటీకి భరిలో దిగబోతున్నారు. ఇక ఏవరు నెగ్గుతారో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: