ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు ఏడుమందిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఇక్కడ సంచలనం ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయేవారుకూ ఈ విషయం ఆ ఏడుగురు భార్యలకు తెలియలేదు. భర్త చనిపోయాడని ఏడుమంది భార్యలు ఒకే చోట చేరారు. వారి భర్త మృతుదేహాన్ని వారికీ ఇవ్వాలంటూ నడిరోడ్డుపై గొడవపడుతూ చచ్చిన భర్త కోసం రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. 


భర్త మృతుదేహం కోసమే ఇంతలా కొట్టుకుంటే బతికి ఉన్నప్పుడు భర్త కోసం ఇంకెంతలా కొట్టుకునే వారో. అందుకేనేమో ఒకరికి తెలీకుండా మరొకరిని ఏడుమంది చిన్న అనుమానం కూడా రాకుండా జీవితం గడిపాడు ఆ వ్యక్తి. ఏమైందో ఏమో .. ఏడు మందిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆత్మహత్య చేసుకొని డ్రైవర్ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  


దీంతో ఆ డ్రైవర్ మృతుదేహాన్ని అందరికి తెలిసిన అతై భార్యతో పాటు ఉండే ఇంటికి తీసుకెళ్లారు. దీంతో ఒకరి తరువాత మరొకరు ఏడుగురు భార్యలు ఆ వ్యక్తి వారి భర్త అంటూ ముందుకొచ్చారు. ఆ మృతుదేహాన్ని వారికీ అప్పగించాలని ఏడుమంది భార్యలు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. అయితే చివరికి పోలీసులు వచ్చి ఈ గొడవను ఆపారు. ఈ విచిత్ర ఆశ్చర్య ఘటన హరిద్వార్ లో జరిగింది.  


హరిద్వార్ లో ఓ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఏడుగురు భార్యలు నా భర్త భర్త అని తిట్టుకొని, కొట్టుకున్నాక వారిని పోలీసులు శాంతి పరిచి అతని అంత్యక్రియలు నిర్వహించారు. 


అయితే ఈ ఘటనను చుసిన స్థానికులు, పోలీసులు అతను మృతి చెందినందుకు మొదట బాధ పడ్డ ఆపై జోకులు వేసుకున్నారు. ఒకరా ? ఇద్దరా ? ఏకంగా ఏడుమంది భార్యలను పెళ్లి చేసుకొని తెలీకుండా మెయింటైన్ చేశాడు. చచ్చి వారి చేతిలో బతికిపోయాడు కానీ లేకుంటే ఆ ఏడుమంది చేతిలో చచ్చేవాడు అంటూ కామెంట్లు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: