ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎస్పీగా సత్య ఏసుబాబు విధులు నిర్వర్తిస్తున్నారు.అనంతపురంకి ఎస్పీగా సత్య ఏసుబాబు ఉన్నంతకాలం టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కేడర్ మొత్తం బాగుంటుందని వ్యాఖ్యలు తెలిపారు. ఒకవేళ అనంతపురం జల్లా ఎస్సీగా సత్య ఏసుబాబు లేకుంటే టీడీపీ కార్యకర్తలు అసలు గ్రామాల్లో కూడా ఉండలేని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు ప్రభాకర్ రెడ్డి.
ఇక గతంలో కూడా ప్రభాకర్ రెడ్డి సత్య ఏసుబాబు పనితీరును చాల మెచ్చుకున్నారు. ప్రజలకు ఉన్న సమస్యలపై ఎస్పీ బాగా స్పందిస్తున్నారని.. పార్టీలకు అతీతంగా పని చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇక ఎస్పీపై జేసీ ప్రశంసలు ఇప్పుడు జిల్లాలో పెద్ద హాట్టాపిక్ మారింది. అంతేకాదు ఒకవేళ జిల్లా ఎస్పీని బదిలీ చేస్తే పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది అని సమాచారం.