భర్త అనుమానించాడని అతి కిరాతకంగా చంపేసింది ఓ భార్య. ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా ? అవునండి. మాములుగా భర్త భార్యను అనుమానిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతారు చాలామంది మహిళలు. కానీ ఈ భార్య మాత్రం విన్నూతంగా వింతగా ప్రవర్తించి భర్తను చంపేసింది.   


వివరాల్లోకి వెళ్తే .. వీర్నపల్లికి చెందిన మంచాల లక్ష్మణ్‌, మౌనిక 8 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే జీవనోపాధి కోసం లక్ష్మణ్ గల్ఫ్ వెళ్లి నాలుగు నెల్ల క్రితం తిరిగి వచ్చాడు. అయితే వచ్చిన సమయం నుంచి భర్త లక్ష్మణ్ మౌనికను అనుమానిస్తూ చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు.    


ఆమె ఫోన్ లో మాట్లాడిన ఎవరితో మాట్లాడుతున్నావ్, ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ ఆమెని ప్రశ్నలు వేసి సతాయించేవాడు. అయితే ఆమె ఇంట్లో వారితోనే మాట్లాడుతున్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అంటూ ఆమె ప్రశ్నించేది. అయితే ఆమె ఎన్ని సార్లు చెప్పిన అతను వినిపించుకోకుండా అనుమానంతో ఆమెని సతాయించేవాడు. దీంతో వారికీ ఇద్దరికీ నిత్యం గొడవలు జరిగేవి. 


భర్త అనుమానాన్ని తట్టుకోలేని మౌనిక విసుగు చెంది భర్తను చంపాలని నిర్ణయిచుకుంది. దీంతో భర్తను చంపడానికి పక్క ప్లాన్ వేసి వేరే ఉరికి తీసుకెళ్లి విషం కలిపినా ఆహారాన్ని ఇచ్చి చంపింది. అనంతరం ఉరికి వెళ్లి కుటుంబసభ్యులతో భర్త తిరిగి గల్ఫ్ కి వెళ్లాడని చెప్పింది. 


అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు భార్య మౌనికను నిలదియ్యగా ఆమె వెళ్లి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఆమెపై  పోలీసులకు అనుమానం రావడంతో ఆమెను పోలీసులు విచారించారు. దీంతో ఆమె భర్తను చంపిందని, భర్త మృతుదేహం వేములవాడలో ఉందని చెప్పింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: