ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది.ఎందుకంటే పెళ్లితో కొత్త బంధాలు,కొత్త సంతోషాలు వచ్చినట్టే అని అనుకునే రోజులు పోయాయి.ఒక్కోసారి ఈ పెళ్లి వల్ల అనుకోని సమస్యలు కూడా ఎదురవుతాయి.మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంటల్లో ఒకరు తేడాగా వున్నా ఆ పెళ్లి కొన్నాళ్లకు ప్రాణాలు తీసే పరిస్దితికి దారి తీస్తుంది. ఎందుకంటే సామరస్యంగా విడిపోయినా గాని కోరికలకు అలవాటు పడిన ప్రాణాలు అక్రమ సంబధాలను కోరుకుంటాయి.మొదట ఈ బంధం బాగానే ఉంటుంది కాని పోనుపోను ఊహించలేనన్ని ట్విస్టులిస్తూ,జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది.చివరకు ఎవరివో ఒకరి ప్రాణాలు తీసుకునే పరిస్దితులు ఏర్పడతాయి.



ఈమధ్య జరుగుతున్న క్రైంలో ఎక్కువగా అక్రమసంబంధాలు పెట్టుకోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు.ఇన్నిజరుగుతున్న మనషుల్లో మార్పు రావడంలేదు.క్షణంసుఖం కోసం నూరేళ్ల జీవితాలను పణంగా పెట్టి కట్టుకున్న వారిని, పుట్టినింటి వారిని ముప్పతిప్పలు పెడుతున్నారు.వారి పరువు తీస్తున్నారు.కన్నవారిని,అనాధలను చేస్తున్నారు.ఇక్కడ ఓ స్త్రీ ఎంత పని చేసిందో,ఆ పనికి ఎంత పుణ్యం సంపాదించుకుందో తెలిస్తే ఛీ అనని వారుండరు.ఈ మహిళ కట్టుకున్న భర్తను వదిలేసి, పదేళ్లుగా ఓవ్యక్తితో సహజీవనం చేస్తోంది.అంతటితో ఆగకుండా అతని స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.చివరకు తన పాత ప్రియుడిని కొత్త ప్రేమికుడితో చంపించింది.



తమిళనాడులో ఈ దారుణ ఘటనచోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే తమిళనాడులోని నామక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వి భర్తనుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగాజీవిస్తోంది.ఇలాంటి సమయంలో కుమారపాళయంకు చెందిన నేతకార్మికుడు వెంకటేశన్‌(38)తో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారితీసింది.అలా అతనితో పదేళ్లు సహజీవనం చేసింది.తర్వాతి కాలం లో ఏర్పడ్ద మనస్పర్ధల వల్ల వెంకటేశన్ స్నేహితుడు పెరుమాళ్‌కు దగ్గరై అతనితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది, విషయం తెలుసుకున్న వెంకటేశన్ ఇద్దరినీ నిలదీయడంతో అతన్ని చంపేయాలని ప్లాన్ చేశారు. ఇంకేముంది ప్లాన్ అమలు చేసి అతన్ని అంతమొందించారు.



మృతుడి శవం నది ఒడ్డున దొరకడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి,విచారణ చేపట్టిన పోలీసులకు అతని గురించిన వివరాలు తెలిసాయి.అందులో సెల్వితో అతనికున్న అక్రమ సంబంధం బయటపడగా సెల్విని,ఆమె ప్రియుడు పెరుమాళ్‌ను ప్రశ్నించగా హత్యకు సంబంధించి ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.ఇక వెంకటేశన్‌ పెట్టే వేధింపు లు తట్టుకోలేక చంపేసినట్టు సెల్వి ఒప్పుకోవడంతోపాటు పెరుమాళ్‌ను పోలీసులకు పట్టించింది.పెరుమాళ్ తన కుమార్తెపై కన్నేశాడని,తనను అనుభవించడమే కాకుండా వయస్సుకు వచ్చిన తన కూతుర్ని కూడ అనుభవించాలని చూసాడని. అందువల్లే అతన్ని పట్టించాలని నిర్ణయించుకున్నట్లు సెల్వి పోలీసుల విచారణలో వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: