పాకిస్థాన్ దేశ రాజ్యాంగం నిబంధనల ప్రకారం ముస్లింలు మాత్రమే ప్రధాన మంత్రి, అధ్యక్ష పదవులను చేపట్టడానికి అర్హులు.
పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 41, 91లో ముస్లిం మాత్రమే అత్యున్న పదవిని అలంకరించడానికి అర్హులని పేర్కొన్నారు. ఆర్టికల్ 41, 91 లకు సవరణ చేయాలని కోరుతూ అధికార
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీఏ)కి చెందిన నేత డాక్టర్
నవీద్ అమైర్
జీవా ఓ బిల్లును గత బుధవారం ప్రవేశపెట్టారు. అయితే క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన
జీవా ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా పార్లమెంటు అడ్డుకుంది.
పార్లమెంటులో అమైర్
జీవా ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల సహాయ
మంత్రి అలీ మహ్మద్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు,
పాకిస్థాన్ ఇస్లాం స్వతంత్ర రాజ్యమని, కేవలం ముస్లిం మాత్రమే ప్రధాని, అధ్యక్షుడు అవ్వడానికి అర్హులని తెలియచేసారు. మరోవైపు, ఈ రాజ్యాంగ సవరణ బిల్లును హక్కుల ఉద్యమకారుడు, జమాతే ఇస్లామీ సభ్యుడు అయిన మౌలానా అబ్దుల్ అక్బర్ చిత్రాలీ స్వాగతించారు.
అయితే అప్పట్లో అంటే 1973లో పాకిస్థాన్ పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ ఒరిజినల్ ముసాయిదా కనిపించకుండా పోయిందనే ప్రచారం కొద్దిరోజుల కిందట నడిచింది. నాటి రాజ్యాంగ ముసాయిదా జాతీయ అసెంబ్లీ రికార్డుల్లో అందుబాటులో లేదని పార్లమెంట్ వర్గాలు తెలిపినట్లు ఓ పత్రిక కథనాన్ని విడుదల చేసింది. జుల్ఫీకర్
అలీ భుట్టో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ 1973 ఏప్రిల్ 10న దేశ తొలి రాజ్యాంగాన్ని ఆమోదించింది.
అయితే ఏప్రిల్ 12న ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో నూతన రాజ్యాంగ ముసాయిదాపై జాతీయ అసెంబ్లీ సభ్యులు సంతకాలు చేశారు. అనంతరం నూతన రాజ్యాంగంపై అధ్యక్షుడు జుల్ఫీకర్
అలీ భుట్టో సంతకం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ హౌస్ రికార్డుల్లో 1973 రాజ్యాంగ ఒరిజినల్ డాక్యుమెంట్ను ఎప్పుడూ చూడలేదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.