గత మూడు రోజులుగా పెట్రోల్ తగ్గుతూ వాహనదారులకు ఉరటనిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాహనదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. హెచ్పీసీఎల్ పెట్రోల్, డీజల్ కొనుగోలుపై అదిరిపోయే క్యాష్బ్యాక్ పొందేలా ఆఫర్ ఇచ్చింది.
హెచ్పీసీఎల్ కస్టమర్లు పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై 100 శాతం వరకు క్యాష్బ్యాక్ పొందే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ కోసం హెచ్పీ రీఫ్యూయెల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా బిల్లు చెల్లించాలి. అలాగే బిల్లు చెల్లింపుపై పేబ్యాక్ పాయింట్లు గెలుచుకోవచ్చు.
హెచ్పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదా డీజల్ వాహనానికి కొట్టించి వాటికీ అయినా బిల్లుని రీఫ్యూయెల్ యాప్ ద్వారా చెల్లిస్తే 100 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. క్యాష్ బ్యాక్ కె కాకా ప్రతి 100 రూపాయలకు 4 పాయింట్లు గెలవచ్చు. ఆ పాయింట్లతో మరోసారి పెట్రోల్ కొట్టించవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 31వరుకు అందుబాటులో ఉంటుంది. పండుగవేళ ఆఫర్ ని వినియోగించుకోండి.