తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము కోసం కొట్లాడిన ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు తెలంగాణ సాధించాక కూడా తమ హక్కుల సాధనకు మళ్ళి సమ్మెకు దిగారు.ఇక సీఎం కేసీఆర్ ఎస్మా ప్రయోగిస్తామని.. ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించినా కూడా  లెక్క చేయకుండా రెండోరోజు సమ్మెలో పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికులు.


 ఇక ఇపుడు దసరా పండుగ పూత ఆర్టీసీ సమ్మెతో సొంతూళ్లకు వెళ్లే వారు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్లు తిరకపోవడంతో. ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిల్ అయిన వారు వారి స్వస్థలాలకు వెళ్లినందుకు రూ.50 నుంచి రూ.200 లోపే చార్జితో వెళ్లేవారు ఇప్పుడు మాత్రం రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.ఇక అధికారులు మాత్రం అద్దె ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో నడిపిస్తున్నారు. కానీ అవి అసలు  సరిపోవడం లేదు.


ఒక వైపు  బతుకమ్మ పండుగ ఉన్న కూడా  సమ్మెలో పాల్కొన్నారు తెలంగాణ కార్మికులు. తెలంగాణ ఉద్యమానికి చుక్కాని అయిన బతుకమ్మలతో నిరసనను ఆర్టీసీ ఉద్యోగులు ప్రస్తుతం సమ్మెకు బాగానే వాడేస్తున్నారు. బతుకమ్మలను పేల్చి డిపోల ముందు నిరసనకు దిగారు. అక్కడే బతుమ్మకలతో నిరసన తెలుపుతున్నారు తెలంగాణ కార్మికులు. దమ్ముంటే బతుకమ్మలపై బస్సులతో తొక్కుకుంటూ వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం కావడంతో బస్సులు ముందుకు పోలేక పొయాయి. ఎక్కడి బస్లు అక్కడే డిపోలకు పరిమితి అయిపోయాయి.


 తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఐనా కూడా  కార్మికులు సైతం ఇదే బతుకమ్మలతో డిపోల ఎదుట నిరసనకు దిగారు.ఇక నేడు  అక్టోబర్ 7న గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించి ఇందిరాపార్క్ వద్ద 15 మంది ఆమరణ నిరాహారణ  దీక్షకు సిద్దామయ్యారు. అలాగే సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు వివిధ ప్రజా విద్యార్థి సంఘాల కూడా మద్దతు కోరారు. దీంతో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: