కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను లాంచ్ చేసింది.ఇక నుండి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ పథకం కింద ఏడాదికి రూ.6,000 అందజేస్తుందని అధికారులు తెలుపుతున్నారు అంతేకాకుండా మూడు విడతల్లో ఇది రైతులకు అకౌంట్లలో జమవుతుందని పేర్కొన్నారు..


ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడో విడత డబ్బులను కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జామ చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పటి దాకా 20,000 మందికే ఈ సబ్సిడీ అందింది. ఇక్కడ గుర్తు పెట్టుకోవలసున విషయం ఏంటంటే. ప్రభుత్వ డేటా ప్రకారం..పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మూడో విడత డబ్బులు పొందేందుకు మొత్తం 50 వేల మంది రైతులకు అర్హత ఉంది.ఇక ఇప్పటికే మూడో విడత డబ్బులు మీ అకౌంట్‌లో జమ అయ్యి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు.


ఒకవేళ డబ్బుల విషయంలో ఏదైన అనుమానం వుంటే,అధికారులను సంప్రదించవచ్చూ, లేదా ఆన్‌లైన్‌లోనే సులభంగా డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అందుకోసం pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవలసి ఉంటుంది.. ఒకవేళ మీకు డబ్బులు రాకుంటే మీరు వెబ్‌సైట్‌‌కు వెళ్లి లాగిన్ అయిన తర్వాత డబ్బులు మీకు ఎందుకు రాలేదో అక్కడ కారణం ఉంటుంది. వాళ్లు చెప్పినట్లు చేస్తే మీ డబ్బులు మీ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.


అప్పటికి మీకు మూడో విడత డబ్బులు రాకపోతే వెంటనే పోర్టల్‌కు వెళ్లి కారణం ఏంటో తెలుసుకోండి.. ఇక దేశవ్యాప్తంగా రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2018 డిసెంబర్ నుంచే రైతులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం... ఫిబ్రవరి 24 నుంచే మొదటి వాయిదా రూ.2,000 చొప్పున 1.01 కోట్ల మంది రైతులకు రూ.2,021 కోట్లు జమ చేసింది. ఏప్రిల్ 1న రైతుల అకౌంట్‌లోకి రెండో వాయిదా రూ.2,000 జమ చేసింది. ఇప్పుడు మూడో విడత డబ్బులను కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జామ చేయడం ప్రారంభించింది...

మరింత సమాచారం తెలుసుకోండి: