కేరళలోని కొల్లం జిల్లాలోని పరిపల్లి అనే ఊరిలో నాలుగేళ్ల బాలికను సొంత తల్లే కోపంతో కొట్టి కాటికి పంపించింది. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్న బిడ్డ ఆదివారం మరణించింది. ఈ రోజుల్లో మనిషిపై పడుతున్న పనిభారం మరియు ఒత్తిడి వల్ల వారు ఏం చేస్తున్నారో కనీసం వారి స్పృహకి కూడా తెలియడం లేదు అనడానికి ఇదే సరైన ఉదాహరణ. సొంత తల్లి రాక్షసిగా మరి తన కన్న కూతురిని చాలా గోరంగా కొట్టి చంపేసిన ఉదంతం ఇప్పుడు కేరళలో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే కేరళలో కన్నతల్లి రాక్షసురాలిగా మారి కేవలం అన్నం తినట్లేదు అన్న కారణంతో నిన్న ఉదయం తన సొంత కూతురిని మదమెక్కినట్లుగా ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఈ విషయాన్ని సొంతంగా చనిపోయిన పాప తల్లి బాధపడుతూ పోలీసులకి తెలియజేసింది. వారికి బంధువైన శిబా అనే ఒక మహిళ కూడా తాను ఆ పాపని ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే చూసినట్లు పోలీసులకు పేర్కొంది. పోలీసులు ఆ పాపను హాస్పిటల్ కి తరలించగా తన తల్లిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు ఆ సమయంలో శిబా పాపతో ఉండగా... చికిత్స తీసుకుంటూ చిన్నారి తన తుది శ్వాసని వదిలింది.

ఇకపోతే చనిపోయిన ఆ పాప మృతదేహాన్ని పరిశీలించగా.... ఆ పాప ఒంటిపై  విపరీతంగా కొట్టిన గాయాలు కనిపించాయి. అభం శుభం తెలియని చిన్నారి మీద అటువంటి గాయాలను చూసి పోలీసులు చలించిపోయారు. ఇంకా పోలీసులు తమ విచారణలో చనిపోయిన ఆ పాపకు ఈ పైపై దెబ్బలే కాకుండా లోపల కూడా ఏమైనా గాయాలయ్యాయా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పాప మృతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రావాల్సి ఉండగా ఇప్పటికే పోలీసుల కస్టడీలో అమ్మాయి తల్లి ఉంది. తన కూతురు మరణవార్త తెలుసుకున్న పాప తండ్రి షాక్ లో స్పృహ కోల్పోగా అతనిని కూడా దగ్గర్లోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: