దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ విగ్రహంను పులిచింతల ప్రాజెక్టు వద్ద నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - రవాణా - సమాచార శాఖ
మంత్రి పేర్ని
నాని తెలిపారు. ఆదివారం పులిచింతల ప్రాజెక్టు వద్ద పులిచింతల జలహారతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గలగలా పారుతున్న కృష్ణమ్మ నదికి మంత్రలు
అనిల్ యాదవ్ పేర్ని నానీలు పసుపు - కుంకుమ - చీరే - సారెలు సమర్పణ చేశారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం సమావేశంలో మంత్రులు మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చాల తన వంతు కృషి చేస్తుందని తెలిపారు.
ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద డాక్టర్ కె.ఎల్. రావు విగ్రహంతో పాటుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 45 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం అని తెలియచేసారు. ఇక్కడే వైఎస్ స్మృతివనంను ఏర్పాటు చేసి అక్కడ పార్కును కూడా నిర్మించి పర్యాటకులకు ఆటవిడుపు కలిగేలా
ప్రకృతి అందాలను ఆస్వాదించేలాగా తయారు చేస్తామన్నారు తెలిపారు. అదే విధంగా కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ వంతెన కూడా నిర్మిస్తామని దాని పొడుగు దాదాపుగా 4కి.మీ.దూరం ఉంటుందన్నారు. అక్కడి రోడ్లు - భవనాలను నిర్మించి పర్యాటకులకు వసతులకు ఇబ్బంది లేకుండా చేస్తాము అని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు.
ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం చాల శుభకరం అని తెలియచేసారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం కోసం దివంగత మహానేత వైఎస్సార్ కోట్ల రూపాయలను మంజూరు చేశారని మరో సారి గుర్తు కూడా చేశారు. పులిచింతల ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతా పచ్చని పొలాలతో అక్కటుకుంటుంది మంత్రులు అన్నారు. మంత్రుల వెంట ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి
శంకర్ రావు పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ తదితరులు పాల్కొన్నారు.