ఏ రంగంలోనూ మహిళల్ని గౌరవించే సంస్కారం ఇసుమంతయినా కనిపించడం లేదు. స్త్రీలను తక్కువగా, నీచంగా, వాడుకోదగిన వస్తువులుగా చూసే వైఖరికి సమాజంలో నిశ్శబ్దంతో కూడిన అంగీకారం వుంది.అందుకనే కొందరు మహిళలు సైతం స్త్రీల దేహాల ఆక్రమణను ఆమోదిస్తున్నారు. మరికొందరు తిరగబడి పోరాడుతున్నారు. కాని దండించినంత మాత్రాన పశువు తన స్వభావాన్ని వదులుకోదు కదా. ఈ నేపథ్యంలో మహిళల 'ఇష్టాయిష్టాల'ను ఎవరు నిర్ణయిస్తున్నారో అర్థం చేసుకోవాలి. మన అభీష్టాలను  ఒకరు శాసించే చోట 'ఇష్టం' అనే సారాన్ని కోల్పోవలసి వస్తుంది.ఇప్పుడు ఆడపిల్లల విషయంలో అదే జరుగుతుంది. ఆడది కనిపిస్తే చాలు ఆకలిగొన్న పులిలా ఆక్రమిస్తున్నాడు మగాడు. ఆసమయంలో వావివరుసలతో పనిలేదు తన మగతనం తృప్తి చెందితే చాలు అనేలా మారిపోతున్నాడు.ఇలా కన్నుమిన్ను కానరాక ఓ వ్యక్తి భార్య చెల్లెలినే అనుభవించాలనుకున్నాడు.హర్యానాలో జరిగిన ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే..హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సోనమ్ అనే యువతికి దసరా పండుగ కావడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. దీంతో ఆమె నాలుగు రోజులు ఉండేందుకు అక్క వద్దకు వెళ్లింది. అక్కడ వయస్సులో ఉన్న మరదలిని చూసిమనసు పడ్డబావ ఆమెపై కన్నేశాడు. తిరిగి వెళ్లోలోగా ఆమెతో ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు.అందుకోసం ప్రయత్నాల్లో భాగంగా వీలు చిక్కినప్పుడల్లా చనువుగా ఉంటూ చేతులు ఎక్కడెక్కడో వేసేవాడు. అక్క మొగుడే కదా అని ఆ విషయాన్ని  ఆమె అంతగా పట్టించుకోలేదు. ఇదే అదనుగా భావించిన అతను తన మరదలు లైన్లోకి వచ్చిందని భావించాడు.ఇక అదే రోజు రాత్రి వేరే గదిలో  ఒంటరిగా నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా అవయవాలపై తాకుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడు. వెంటనే మెలకువ వచ్చిన యువతి బావ చేస్తున్నాపని అర్ధంచేసుకుని  గట్టిగా అక్కా అంటూ కేకలు వేసింది. వెంటనే అరవకుండా ఆమె నోరు నొక్కేసిన బావ తన కోరిక తీర్చాలని వేధించాడు. తాను అలాంటి దానిని కాదని, తన జీవితం నాశనం చేయొద్దని వేడుకున్నా కనికరించకుండా తలుపుకు గడియపెట్టి మరదలిని మంచంపైకి తోసి మీదికి దూకి అత్యాచారం చేసేందుకు యత్నించాడు.ఈ లోపల చెల్లెలు గదిలోనుండి గట్టిగా కేకలు వస్తుండటంతో ఉలిక్కిపడి లేచిన ఆమె అక్క పరుగుపరుగున ఆ గది దగ్గరకు వచ్చి కిటికీలో నుంచి భర్త చేస్తున్న అఘాయిత్యాన్ని చూసి షాకైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై అత్యాచారయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనతో ఆడపిల్లలు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఒంటరిగా అసలే ఉండకూడదని అర్ధం చేసుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: