మనుషుల్లో రోజు రోజుకు నైతిక విలువలు దిగజారి పోతున్నాయి. కోరిక‌ల‌ను అదుపు చేసుకోలేక వావి వ‌ర‌స‌లు మ‌ర్చిపోయి మ‌రి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ ఘోరం జ‌రిగింది. ఓ మహిళ తన ఇద్దరి అల్లుళ్లతో వివాహేతర సంబంధం పెట్టుంది. ఇది తెలిసిన భర్త ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆ అత్త మాత్రం ఇద్ద‌రు అల్లుళ్ల‌తో త‌న కోరిక‌లు తీర్చుకుంటోంది. ఈ ఘోరం ప‌లుసార్లు చూసిన ఆమె భ‌ర్త ఎంతో ఆవేద‌న‌కు గుర‌య్యి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 


అయితే అత్త చేస్తోన్న ప‌నికి ఓ వ్య‌క్తి అడ్డు చెప్ప‌డంతో చివ‌ర‌కు ఆ వ్య‌క్తినే దారుణంగా హ‌త్య చేశారు. హత్యకు గురైనా శ్రీనివాస్ భార్య కథనం ప్రకారం.. గుంటురుకు చెందిన సుగుణమ్మ తన భర్త శ్రీనివాస్ కలిసి నివాసం ఉంటోంది. శ్రీనివాస్ స‌మీప బంధువు భార్య త‌న ఇద్ద‌రు అల్లుళ్ల‌తో ఎఫైర్ పెట్టుకుని శారీర‌క సంబంధం కొన‌సాగిస్తోంది. కొద్ది రోజులుగా ఈ తంతు న‌డుస్తోంది. ఈ విషయం తెలిసి వివాహేతర సంబంధం పెట్టుకున్న ‍మహిళ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 


త‌న బంధువు ఆత్మ‌హ‌త్య‌తో క‌ల‌త చెందిన శ్రీనివాస్ ఇందుకు కార‌ణ‌మైన త‌న బంధువు భార్య‌తో పాటు ఆమె ఇద్దరి అల్లుళ్లను మందలించాడు. ఇకపై ఇంలాంటి ఘటన పునరావృతం అయితే ఉరుకునేది లేదని హెచ్చరించాడు. శ్రీనివాస్‌ను అడ్డు తొల‌గించుకోక‌పోతే త‌మ సంబంధానికి ఎప్ప‌టికి అయినా అడ్డు వ‌స్తాడ‌ని భావించిన ఆ ముగ్గురు అత‌డిని చంపేందుకు ప్లాన్ చేశారు. అత‌డిని చంపేయ‌డంతో చివ‌ర‌కు శ్రీనివాస్ భార్య గుంటూరు రూర‌ల్ విజ‌య‌ల‌క్ష్మికి ఫిర్యాదు చేశారు.


పోలీసులు హ‌త్య‌కు కార‌ణ‌మైన ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. అయితే వారిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటే తనను ముగ్గురు పిల్లలను చంపుతామని నిందితుల బంధువులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలోనే త‌న పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కూడా ఆమె కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: