దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా ఎస్బీఐ సరికొత్త పండుగ ఆఫర్ ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగించే వారందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రకరకాల  బ్రాండ్లతో జత కట్టింది. ఈ ఆఫర్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే టాప్ స్పెండర్లు లక్ష రూపాయల విలువ గల హాలిడే వోచర్ ను గెలుచుకోవచ్చు. 
 
ఈ వోచర్ ను మేక్ మై ట్రిప్ యాప్ అందిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా ప్రైజ్, వీక్లీ ప్రైజ్, డైలీ ప్రైజ్, అవర్లీ ప్రైజ్ కూడా అందిస్తుంది. షావోమీ కంపెనీ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజ్ లు కూడా ఉచితంగా గెలుచుకోవచ్చు. ఎస్బీఐ పుమా 1000 రూపాయల విలువ గల గిఫ్ట్ వోచర్ ను అవర్లీ ప్రైజ్ కింద అందిస్తోంది. డైలీ ప్రైజ్ లో భాగంగా 7000 రూపాయల విలువ గల వైర్ లెస్ హెడ్ ఫోన్స్ గెలుచుకోవచ్చు. 
 
వీక్లీ ప్రైజ్ కేటగిరీలో 17,499 రూపాయల విలువ గల ఎంఐ ఏ3 ఫోన్ ను గెలుచుకోవచ్చు. ఈ నెల చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఎస్బీఐ దసరా పండుగ సమయంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో వినియోగదారులను ఆకర్షించే నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటోంది. 
 
కొన్ని రోజుల క్రితం ఎస్బీఐ ఖాతాదారులు ఉపయోగించే ఏటీఎం కార్డులను బట్టి నగదు విత్ డ్రా పరిమితిని లక్ష రూపాయల వరకు పెంచిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఉన్న ఖాతాదారులు రోజుకు లక్ష రూపాయల వరకు ఏటీఎం నుండి విత్ డ్రా చేసుకునే సదుపాయాన్నీ ఎస్బీఐ కల్పించింది. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: