ఐదు రోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఓ వైపు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న మరోవైపు ఆర్టీసీ కార్మికులు మొర  పెట్టుకుంటున్న కనీసం ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రోజు రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పెరుగుతూ వస్తుంది. ప్రతిపక్ష నేతలందరూ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు... అఖిలపక్ష నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు,  ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలను ఆహ్వానించారు.

 

 

 

 

 ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం లో కేసీఆర్ నిరంకుశత్వ వైఖరి అవలంభిస్తున్నారని... కార్మికుల సమస్యలను కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 అయితే ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చే యోచనలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మరోసారి విపక్షాలతో ఆర్టీసీ కార్మిక నేతలు భేటీ  కానున్నారు. కాగా  తెలంగాణ బంద్ కి  సంబంధించి రేపు మధ్యాహ్నం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

 

 

 

 

 అయితే ఈ సందర్భంగ మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు అందరూ ఆర్టీసీ సమ్మె చేస్తుంది జీతాలు పెరగడానికొ  ఉద్యోగ భద్రత కోసం కాదని ఆర్టిసి ని  బతికించుకోవడం కోసమే ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీని బతికించుకోవడం ఆర్టీసీ కార్మికుల లక్ష్యమన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో  నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు అశ్వథామరెడ్డి .

మరింత సమాచారం తెలుసుకోండి: