రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఐదొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిన మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రభుత్వం, మీరు దిగొచ్చే వరుకు మేము సమ్మె అపమూ అన్నట్టు ఆర్టీసీ కార్మికులు ప్రవర్తిస్తున్నారు. వీరి ఇద్దరి మధ్య ప్రయాణికులు నలిగిపోతున్నారు. పండగ వేళ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేల చేశారు. 

                      

దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, టీడీపీ, టీజేఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన పలు ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు నిర్వహించిన ఈ సమావేశానికి బీజేపీ నేత రామచంద్రరావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఏ నేత సుధాకర్, జనసేన నేత శంకర్ గౌడ తదితరులు హాజరయ్యారు.  

              

ఈ సందర్భంగా కేసీఆర్ తీరుపై పలువురు నేతలు మండిపడ్డారు. సమ్మెను వ్యతిరేకంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారనివ్యాఖ్యానించారు. ఆర్టీసీని గతంలో ప్రైవేటీకరణ చెయ్యడానికి ప్రయత్నించారని కానీ అది అవ్వలేదని అఖిలపక్షం నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ సమ్మె ఉద్దేశం జీతాలు కాదని ఆర్టీసీని బతికించుకోవడమే అని అయన అన్నారు. 

                       

గత 5 సంవత్సరాలలో ఆర్టీసీలో ఒక్క నియామకం కూడా జరగలేదని అశ్వత్థామరెడ్డి విమర్శించారు. ఆరు సంవత్సరాలలో ఆరు వేళా మంది పదవి విరమణ చేశారని అయన అన్నారు. కాగా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడు అని అఖిలపక్షం నేతలు అభిప్రాయపడ్డారు.

          

మరింత సమాచారం తెలుసుకోండి: