అమ్మను పూజించడం మన సంప్రదాయమ అని.. దేశంలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించడం మనందరి బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దసరా వేడుకల సందర్బంగా ఢిల్లీలోని ద్వారకలో డీడీఏ మైదానం వేదికగా జరిగిన రావణ దహనం కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిధిగా పాల్కొన్నారు. ఇదే వేదికగా ఆయన దేశ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘అమ్మను పూజించే గడ్డ మనది. దేశంలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మన్‌కీ బాత్ సందర్భంగా కూడా నేను ఇదే విషయాన్ని ప్రముఖంగా తెలియచేతున్న. ఆడపిల్లలు ‘లక్ష్మీ’దేవి స్వరూపాలనీ.. ఈ దీపావళి సందర్భంగా వారి విజయాలను వేడుకలా జరుపుకోవాలని నేను చెప్పాను..’’ అని ప్రధాని ఒక సరి అందరికి గుర్తు చేశారు.అమ్మను పూజించడం మన కర్తవ్యం అని  మోదీ తెలిపారు 


కాగా దసరా వేడుకల సందర్భంగా రావణుడి బొమ్మపైకి మోదీ బాణం వేసి నిప్పును వెలిగించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో కూడా షేర్ చేసుకున్నారు. ‘‘శ్రీ రామచంద్రుని ఆశీర్వాదాలు మనపై ఎప్పటికి ఉండాలని మనవి చేస్తున్నాను. సత్యానికున్న బలం, మంచితనం, కరుణలదే ఎల్లప్పుడూ పైచేయి అవ్వాలి. చెడు నశించాలి. జైశ్రీరాం..’’ అని ప్రధాని ఈ సందర్భంగా తెలియచేసారు అందరికి.


ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన పోస్టుకి కూడా మంచి స్పందన లభించింది. అందరు దసరా శుభాకాంక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేసారు. ఢిల్లీలో కూడా భారీ సంఖ్యలో ప్రజలు పాల్కొన్నారు. అందరు దేశం వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు దసరా ఉత్సవాలను. ఈ దసరా అందరికి విజయాలు తీసుకొని రవాలి అని కోరుచున్నాము. సభలో పాల్కొనవారి అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని.


మరింత సమాచారం తెలుసుకోండి: