మెగాస్టార్ చిరంజీవికి, హీరో రాజశేఖర్ కు ఉన్న విబేధాల గురించి తెలిసిందే. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం జరిగిన సమయంలో రాజశేఖర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ హీరో రాజశేఖర్ ఫ్యామిలీపై దాడికి ప్రయత్నించడం అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత ఆ విబేధాలు అలాగే కొనసాగాయని అంతా అనుకున్నారు.


కానీ ఇటీవలి కాలంలో రాజశేఖర్ ఫ్యామిలీతో సహా వెళ్లి చిరంజీవిని కలవడం కూడా అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అసలు చిరంజీవిని రాజశేఖర్ ఫ్యామలీ ఎందుకు వెళ్లి కలిసిందనే విషయంపై జీవిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే.. చిరంజీవిగారితో మాకు ఇష్యూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజశేఖర్‌గారు వెళ్లి ఆయనను కలిసి ‘గరుడవేగ’ చూడమని అడిగారు.


‘అప్పుడు చిరును తిట్టిన రాజశేఖర్‌ ఇప్పుడు వెళ్లి కలిశారేంటి? సినిమా సక్సెస్‌ కావాలని ఆయనను కలిశారా?’ అంటూ సోషల్‌మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. ‘జీవితంలో ఎవరితోనూ శత్రుత్వం అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో కొందరు నచ్చుతారు. కొందరు నచ్చరు. అది అప్పటివరకే.. అంటూ వివరణ ఇచ్చారు జీవిత.


అంతే కాదు.. ఆ సమయంలో రాజశేఖర్ రియాక్షన్ గురించి చెప్పారావిడ.. “ సోషల్‌మీడియాలో వచ్చిన వాటి గురించి మర్చిపోండి. ఆ గొడవ తర్వాత మనం ఆయనని చాలా ఫంక్షన్స్‌లో కలిశాం. చక్కగా మాట్లాడుకున్నాం. చిరంజీవి సినిమా చూసి అభిప్రాయం చెబితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల తర్వాత ఆ స్థాయి వ్యక్తి ఆయన. సోషల్‌మీడియా, వెబ్‌సైట్‌లలో రాసి వాటి గురించి పట్టించుకోకండి’ అని రాజశేఖర్‌ జీవితతో చెప్పారట. ఇదీ ఆయన మనస్తత్వం.. అంటూ వివరించారు జీవిత.. ఏదేమైనా ఎప్పటికీ ఎవరూ శత్రువులుగా ఉండరు.. మిత్రులుగానూ ఉండరు.. అభిమానులు ఈ విషయం గమనిస్తే మంచిదేమో..


మరింత సమాచారం తెలుసుకోండి: