బాషా సినిమాలోని రజనీకాంత్ మాదిరి ఆంధ్రాలో ఆటో వారిపై జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.. సొంత ఆటో ఉన్న వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బుని జమ చేసి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలుపుకున్నారు.. 

ఇదిలావుండగా నేడు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ (నాని) ఆటోలో సామాన్య ప్రయాణికుడి వలె కొద్ది దూరం ప్రయాణం చేశారు.. తన సొంత నియోజకవర్గమైన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించిన మంత్రి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సరదాగా ఆటోలో కొంత సమయం ప్రయాణించారు. గన్‌మెన్లు, కాన్వాయ్‌తో హడావిడిగా కనిపించే మంత్రి.... ఇలా తన కారును వదిలేసి ఆటో ప్రయాణం చేయడం.,, అంతేకాదు ఆటోలో స్థానికులతో కాసేపు ముచ్చటించడం...,, కొంత ఆసక్తి గా మారింది. సామాన్యుడిలా అందరితో కలిసి ఆటోలో ప్రయాణించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రజలతో కలిసిపోయినప్పుడే స్థానికంగా ఉండే సమస్యలు తెలుస్తాయని...,, అందుకే ఇలా ఆటోలో ప్రయాణం చేసానని చెప్పుకొచ్చారు మంత్రి నాని. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా మంత్రి ఆటోలో ప్రయాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయని.. ఇలా స్థానికులతో కలిసిపోయి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని వారి నియోజకవర్గ ప్రజలు చెప్పడం విశేషం. అంతేకాదు మంత్రి అయ్యాక కూడా తన సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం ప్రజలకు ఎప్పుడు తాను అందుబాటులో ఉంటున్నారనే  పేరు కూడా ఉంది. 

మొన్న ఆంధ్ర ఆర్టీసీ వారిని ప్రభుత్వం లోకి విలీనం చేయడం..,, నిన్న ఆటో వారికి కానుకలివ్వడం..,, నేడు మంత్రుల స్థాయిలో ఉండి సామాన్యుల వలే కనిపించడం.. కొందరు జగన్ ప్రభుత్వన్ని మెచ్చుకొనగా... మరికొందరు కేవలం మీడియా వారి ఆకర్షణార్ధమై ఇదంతా చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా చేయనున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: