పదవి లేకపోతేనేం... పోరాటానికి ఎప్పుడు ముందుండే జనసేన స్థాపకుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన గళం విప్పారు.. వెంకటాచలం ఎంపీడీవో సరళ.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదంపై రాజకీయ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేసు, అరెస్ట్, బెయిల్‌పై వచ్చాక కూడా ప్రతిపక్షాలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత జాలి చూపిస్తున్నారని..,, దీనికి ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తారని..,, పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఎంపీడీవో సరళ పెట్టిన క్రిమినల్‌ కేసును నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశాన్నిస్తుంది? మా శాసన సభ్యులు దాడులు చేస్తారు.. మీరు భరించండి అనే సంకేతాలిస్తోందా? ప్రజాప్రతినిధులే చట్టాన్ని గౌరవించకపోతే చట్టానికి విలువ ఎక్కడ నుంచి వస్తుంది? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

‘‘ప్రతిపక్ష నేతలు ప్రజా సమస్యలపై రోడ్డెక్కి నిరసన గళం విప్పితే.. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద., ఒక్కోసారి 307 వంటి హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు... ఇది వాస్తవం.. కానీ ఒక మహిళా ఉద్యోగిపైన దాడి చేసిన శాసన సభ్యుడు కోటంరెడ్డిపై మాత్రం బెయిల్‌ సులువుగా ఇచ్చే 448, 427, 506, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ఏంటని..,, అసలీ సెక్షన్ల కింద నమోదయ్యే కేసులలో కేవలం స్వల్ప జరిమానా, లేదా నామమాత్రపు శిక్ష మాత్రమే విధిస్తారని.., నిజానికి ప్రభుత్వ అధికారి మీద దాడి చేసిన వారిపై 353, 354 సెక్షన్ల కింద బెయిల్‌ ఇవ్వడానికి వీలు లేనటువంటి కేసులు పెట్టాలి. కానీ పోలీసులు ఆ పనిని విస్మరించారు., అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ ఒత్తిడే కారణమని జనసేన భావిస్తుండగా,, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడవలసిన భాద్యత  ప్రభుత్వంపై వుందని..,, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: