ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకొని ఆంధ్రని అభివృద్ధి వైపు నడిపిస్తుంటే అవి అన్ని చూసి తట్టుకోలేక జగన్ నేరస్తుడని, రాష్ట్రంలో రౌడీ ప్రభుత్వం నడుస్తోందని ప్రతిపక్ష అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. 

                    

 
ఎన్నడూ.. ఎక్కడ లేని విధంగా ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించన ముఖ్యమంత్రిని నేరస్తుడు అని వ్యాఖ్యానించడం దారుణమని అంబటి అన్నారు. జగన్‌పై నేరారోపణలు చేశారు అవి విచారణలో ఉన్నాయి.. అలాంటప్పుడు నేరస్తుడు అని ఎలా అంటారు అని అంబటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

                               

 
కాగా చంద్రబాబు పదేపదే పులివెందుల పంచాయితీ అని జగన్‌పై ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. పంచాయితీల అలవాటు వైఎస్ కుటుంబానికి లేదని, అవి చేసేది చంద్రబాబేనని ఆయన విమర్శించారు. అతని పార్టీకి చెందిన ఎంతో మంది నాయికలు పంచాయితీలు చేసింది చంద్రబాబు అని నిజాలు బయట పెట్టారు. 

                      

 
పులివెందుల పంచాయితీ కాదు పౌరుషాల ప్రాంతమని అంబటి వ్యాఖ్యానించారు. పులివెందుల పంచాయితీ అని మళ్లీ మాట్లాడితే చంద్రబాబు మూతి మీద అట్లకాడ కాల్చి వాత పెట్టాలని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా మాట్లాడుతారో చూడాలి. 

                              

మరింత సమాచారం తెలుసుకోండి: