వాహనదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. దేశంలో ఇంధన ధరలు మళ్ళీ తగ్గాయి. వరుసగా 9 రోజులు నుంచి పెట్రోల్, డీజల్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మొన్న ఒక్క రోజు తప్ప మిగితా అన్ని రోజులు పెట్రోల్, డీజల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈరోజు మళ్ళి పెట్రోల్, డీజల్ ధరలు భారీగా తగ్గాయి. కాగా ఈరోజు శుక్రవారం పెట్రోల్ 13 పైసలు, డీజిల్ ధర 17 పైసలు చొప్పున తగ్గాయి.  


దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.78.07కు తగ్గింది. డీజిల్ ధర రూ.72.62కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 12 పైసలు తగ్గుదలతో రూ.77.68కు వద్ద, డీజిల్‌ ధర 15 పైసలు క్షీణతతో రూ.71.55 కు చేరింది. 


ఇక విజయవాడలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 12 పైసలు తగ్గుదలతో రూ.77.68కు క్షిణించగా, డీజిల్ ధర కూడా 15 పైసలు క్షీణతతో రూ.71.55కు చేరింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని బట్టి చూస్తే పెట్రోల్, డీజల్ ధరలు రేపు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 


మరి పెట్రోల్ డీజల్ ధరలు రేపు ఎంత పెరుగుతాయి.. ఈ 9 రోజుల తగ్గిన పెట్రోల్, ధరలు తగ్గుతాయి అనేది చూడాలి. కాగా దేశంలోనే అతి తక్కువ ధరతో పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. అది ఎక్కడో కాదు ఢిల్లీ మార్కెట్ లో పెట్రోల్, డీజల్ ధరలు అతి తక్కువ ధరలో తగ్గాయి. పెట్రోల్ ధర రూ.73.59 వద్ద, డీజిల్ ధర రూ.66.81 వద్ద నిలకడగా కొనసాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: