రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు చెన్నైకు చేరుకోనున్నారు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​. చారిత్రక మామల్లపురం వేదికగా ప్రధాని మోదీతో జరగనున్న ఇష్టాగోష్ఠిలో పాల్గొననున్నారు జిన్​పింగ్​. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. ఈ పర్యటనతో భారత్​-చైనా మధ్య ద్వైపాక్షిక మైత్రి మరింత బలపడుతుందని ఇరువర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై చేరుకుని.. తిరిగి శనివారం మధ్యాహ్నం చైనాకు బయలుదేరనున్న జిన్​పింగ్ పూర్తి పర్యటన ఇలా సాగనుంది.


అక్టోబర్​ 11 (శుక్రవారం) మధ్యాహ్నం1:20 : ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​.1:45 : గిండీ ప్రాంతంలోని ఐటీసీ ఛోళా హోటల్​కు చేరుకోనున్న జిన్​పింగ్​. అక్కడే కాసేపు సేదతీరి.. మహాబలిపురానికి పయనం. సాయంత్రం..మహాబలిపురంలో జిన్​పింగ్​కు ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం


5:00 : 'అర్జున పెనెన్స్' సందర్శన
5:20 : పంచరథాల స్మారక సముదాయం సందర్శన
5:45 : షోర్​ దేవాలయానికి ఇరువురు నేతలు.

అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించనున్న మోదీ-జిన్​పింగ్​, మహాబలిపురంలోనే రాత్రి భోజనం. 9:00 : చెన్నై ఐటీసీ ఛోళా హోటల్​కు జిన్​పింగ్​ తిరుగుపయనం.



అక్టోబర్​ 12 (శనివారం) ఉదయం 9 గంటలకు జిన్​పింగ్​ మహాబలిపురానికి పయనమవుతారు. అనంతరం ప్రధాని మోదీతో చైనా అధ్యక్షుడు అనధికారిక భేటీలో పాల్గొంటారు.మధ్యాహ్నం 1:00 : జిన్​పింగ్​ చెన్నైకు తిరుగుపయనం. 2:20 : చైనాకు బయలుదేరనున్న జిన్​పింగ్​. (పరిస్థితులను బట్టి ఈ సమయాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది.). తొలిసారిగా తమ రాష్ట్రానికి రానున్న జిన్ పింగ్ కు చెన్నై విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలుకుతున్నారు. చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు భారీ స్థాయిలో జిన్ పింగ్ మాస్క్ లను ధరించారు. జిన్ పింగ్ భారీ చిత్రపటాన్ని తమ కళాశాల మైదానంలో ఆవిష్కరించారు. ఆ చిత్రపటం ముందు చైనా లిపిలో స్వాగతం పలుకుతూ ఆసీనులయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: