ఆవును గోమాతగా భారతదేశంలోని హిందువులు కొలుస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఈ గోపూజ చేస్తే చాలమంచిదని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇక కొందరు ఆరోగ్యం కోసం గో మూత్రం తాగే వారున్నారు. అంతే కాదు గో ఆశ్రమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఈ గోమాతను సకల దేవతలకు నిలయాలుగా భావించి పూజిస్తారు. ఇక గోవుకు పుట్టిన లేగదూడను కూడా గో పూజలో భాగం చేస్తారు కొందరు.


ఆవుల పట్ల ఇలాంటి పవిత్ర భావాలు కలిగిన ఈ భారత దేశంలో ఇప్పటికే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఇప్పుడు సమాజంలో పరిస్థితులు రోజు రోజుకీ దారుణంగా తయారౌతున్నాయి. ఎలాగంటే పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. తల్లీ, చెల్లీ అనే తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కనీసం మూగ జీవులను కూడా వదలడం లేదు. ఇంతలా మనిషి కామ ప్రవృత్తిని తనలో పెంపొందిస్తూ వున్నాడు.   తాజాగా ఓ లేగ దూడపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం నిజాంపూర్‌లో గురువారం రాత్రి పశువుల కొట్టంలో ఉన్న లేగ దూడపై  జేడీ లక్ష్మణ్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటి ఆవరణలో ఉన్న పశువుల కొట్టంలో కట్టివేసి ఉన్న లేగదూడ పట్ల జైడి లక్ష్మణ్‌ అనాగరికంగా ప్రవర్తించడాన్ని గమనించిన స్థానికులు యజమాని దృష్టికి తీసుకెళ్లారు. లేగదూడ యజమాని తెనుగు పోశెట్టి ఫిర్యాదు చేయగా.. లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.


లేగదూడకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే అది మూగజీవి, మనిషి రూపంలో వున్న రాక్షసుడు తనను ఏం చేస్తున్నాడో గ్రహించలేని అమాయకపు ప్రాణి. ఒకవేళ తెలిసిన చెప్పడానికి నోరుకూడ లేదు. అలాంటి ప్రాణిపట్ల  ఆ యువకుడు చేసిన పనికి స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అతను చేసిన తప్పుకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పోలీసుల్ని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: