టీడీపీ ని వీడి జూపూడి ప్రభాకర్ రావు వైస్సార్ కాంగ్రెస్ లో అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షం లో చేరారు . అయితే జూపూడి, కొత్తగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరలేదు . గతం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కొనసాగిన ఆయన 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందడంతో టీడీపీ లో చేరారు . టీడీపీ లో చేరిన వెంటనే ఆ పార్టీ నాయకత్వం ప్రాపకం కోసం, జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు . జగన్ ఒక సైకో అని , బాహుబలి సినిమా లో కాలకేయ వంటివాడంటూ విరుచుకుపడ్డారు .
ప్రతిరోజూ ఎదో ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొంటూ , ఐదేళ్లపాటు జగన్ మోహన్ రెడ్డి పై ఇష్టారీతి లో విమర్శలు గుప్పించిన జూపూడిని , ఇప్పుడు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవడాన్ని పార్టీ సానుభూతిపరులు సోషల్ మీడియా వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . జూపూడి ఏమైనా ప్రజాబలం ఉన్న నాయకుడా? అంటే కానే కాదని, అటువంటి నాయకుడ్ని తిరిగి పార్టీ లో చేర్చుకోవడం ద్వారా కలిగే లాభం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది . గతం లో జగన్ మోహన్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించినట్లుగానే , ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేస్తే, చేయవచ్చునని ... దానివల్ల పార్టీకి ఏమైన ప్రయోజనం చేకూరుతుందా? అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు .
గతం లో జగన్ మోహన్ రెడ్డి విమర్శించిన నోటితోనే , ఇప్పుడూ అదే నోటితోనే చంద్రబాబు ను విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారా? అంటూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు . ఏతా ..వాత చెప్పేది ఏంటంటే జూపూడి ని తిరిగి పార్టీ లో చేర్చుకుని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసిందని భావనలో ఆ పార్టీ సానుభూతిపరులు ఉన్నారు .