బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణని వైసీపీకి అద్దె గొంతు అని టీడీపీ నిన్నటివరకూ గోల పెట్టింది. జగన్ పార్టీలో వెళ్లాల్సిన కన్నా చివరి నిముషంలో ఆగి మరీ బీజేపీలో చేరారంటే ఆ రెండు పార్టీల మధ్య బంధం చాలా గట్టిదని కూడా చాటింపు వేసింది. మరి అటువంటి కన్నా ఎన్నికల తరువాత టీడీపీకి బాగా అనిపించాడేమో. మరో వైపు కన్నా కూడా వైసీపీని ఘాటుగా విమర్శిస్తూ టీడీపీకి మహదానందాన్ని కలిగిస్తున్నాడు.


టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సుజానాచౌదరితో కలసి అమరావతి రాజధానిని చూసిన కన్నా ఇపుడు పోలవరం ప్రాజెక్ట్ ని పరిశీలిస్తున్నారు. పోలవరంలో అవినీతి జరగలేదని కూడా కన్నా మార్క్ సర్టిఫికేట్  ఇచ్చేస్తున్నారు. నాలుగు నెలల వైసీపీ పాలనలో ఒక్కటంటే ఒక్క అవినీతి వ్యవహారాన్ని రుజువు చేయలేకపోయింది  అంటూ కన్నా విసుర్లు విసురుతున్నారు. అవినీతి మీద అధారాలు చూపించిన తరువాత పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కి జగన్ సర్కార్ వెళ్ళాసిందని కూడా కన్నా అంటున్నారు . అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి కన్నా అంటున్నదేంటంటే పోలవరంలో అవినీతి జరగలేదని. అచ్చం టీడీపీ మాటల్లాగానే ఇది ఉందని వైసీపీ నేతలు అంటున్నారు పచ్చ గొంతుతో కన్నా మాట్లాడుతున్నారని కూడా విమర్శిస్తున్నారు.


ఇక ఇసుక కొరత  విషయంలో గొడవ చేసినా, ఏపీలో అభివ్రుధ్ధి ఆగిపోయిందని గొల్లు చేసినా కూడా కన్నా టీడీపీ అడుగులో అడుగు వేస్తున్నట్లుగానే  ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు ఓ వైపు జగన్ని విమర్శిస్తూంటే కన్నా కూడా అంతే దూకుడుగా హాట్ కామెంట్స్ చేయడం అంటే కన్నా ఎవరికి అద్దె మైక్ ఇపుడు అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి కన్నా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఆయన పొలిటికల్ గేమ్ ప్లాన్ లో జగన్ బలి అవుతున్నడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: