ప్రస్తుత సమాజంలో రోజుకొక దొంగ బాబా తెర మీదికి వస్తున్నాడు. ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. బాబాల ముసుగులో కేటుగాళ్లు భారీ బిజినెస్ చేస్తున్నారు. ఇంకొందరైతే స్వామీజీల ముసుగులో మహిళల మానప్రాణాలకు దోచుకుని లైంగిక వేధింపులకు గురు చేస్తున్నారు.ఇక స్వామిజీల గుట్టు తెలియని జనాలు తండోపతండాలుగా స్వామీజీల చెంతకు చేరి... ఆతర్వాత మోసపోయామని గ్రహిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా చాలామంది స్వామీజీల చెంతకు చేరుతుండడంతో స్వామీజీ లకు గిరాకీ బాగానే ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది కేటుగాళ్లు స్వామీజీల ముసుగులు వేసుకుని మహిళలను వేధించిన ఘటనలు ఎన్నో చూసామ్ ... ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనే మారోటి చోటుచేసుకుంది.
జ్వరం వచ్చిన కడుపు నొప్పి వచ్చిన తలనొప్పి వచ్చినా అన్నిటికీ స్వామియే దిక్కు అంటూ అంటూ ప్రజలు మూఢ నమ్మకాలతో స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. ప్రజలు మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని వారి నుండి డబ్బులు దండుకుంటున్నారు స్వామీజీలు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన శ్రీకాంత్ కొన్నాళ్ల క్రితం స్వామీజీ అవతారం ఎత్తాడు. తనకు మహిమాన్విత శక్తులు ఉన్నాయని ప్రచారం చేసి మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించాడు . ఇక స్వామీజీ ఉన్నాడు అంటే చాలు క్యూ కట్టే జనాలు... శ్రీకాంత్ స్వామిజి దగ్గర కూడా రావడం మొదలుపెట్టారు.
ఇక అదే అదనుగా భావించిన శ్రీకాంత్ స్వామీజీ... తన దగ్గరికి వస్తున్న ప్రజల దగ్గర నుండి భారీగా డబ్బులు దండుకోవటం మొదలు పెట్టాడు. ఇక అక్కడి ప్రజలు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా శ్రీకాంత్ స్వామి దగ్గరికి వస్తుండడంతో... వాళ్ల నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నాడు శ్రీకాంత్ స్వామీజీ. కొన్నాళ్ళకి మహిళలు యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు శ్రీకాంత్ స్వామిజీ. కాగా శ్రీకాంత్ స్వామీజీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పటికీ బయట చెప్తే ఎక్కడ పరువు పోతుందోనని కొందరు మహిళలు... ఇక స్వామిజీ తమ సమస్యలు తీరడానికి అలా చేస్తున్నాడేమో అని మూఢ నమ్మకంతో ఇంకొందరు స్వామీజీ చేస్తున్న చేష్టలను బయట పెట్టకపోవడంతో రోజురోజుకీ స్వామీజీ అసభ్య ప్రవర్తన ఎక్కువయింది. కాగా ఇటీవలే ఈ విషయం వెలుగులోకి రావడంతో శ్రీకాంత్ స్వామీజీ గుట్టు రట్టయింది. ఇక ఈ విషయం కాస్త పోలీసుల వరకు చేయడంతో శ్రీకాంత్ స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.