మైనర్ బాలికలపై దాడులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. అప్పుడప్పుడు లోకాన్ని అర్థం చేసుకుంటున్న మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్నారు. ఇక కాలేజీల చుట్టూ తిరిగి మాయ మాటలు చెప్పి నమ్మిస్తున్నారు. దీంతో మైనర్ బాలికలు జీవితాలను చింద్రం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా... ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం లో జరిగింది ఈ ఘటన. శ్రీకాకుళం జిల్లా పోలాకి చెందిన ఓ బాలిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కాగా రోజు సైకిల్ పై కాలేజీకి వెళ్లి వస్తుండేది. దీంతో అదే గ్రామానికి చెందిన యువకుడు వెంకటేష్ ఆ బాలికను ప్రేమిస్తున్నానంటూ ఆ బాలిక వెంటపడ్డాడు.
రోజు కాలేజీ చుట్టూ తెగ తిరిగే వాడు. మాయ మాటలు చెప్పి ఆ బాలికను నమ్మించి ప్రేమలోకి దింపాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకుందాం మాయమాటలు చెప్పి ఆ బాలికను నమ్మించాడు . ఆ బాలిక తన తాత గారి ఇంటి వద్ద ఉన్న విషయం తెలుసుకున్న ఆ యువకుడు... బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సమీపంలోని అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాళి కట్టాడు.ఇక ఆ తర్వాత బాలిక తో కలిసి వెంకటేష్ అక్కడే రాత్రి గుడిలో గడిపారు. అయితే ఆ బాలిక పొద్దున లేచి చూసేసరికి పక్కన వెంకటేష్ లేకపోవడంతో... మోసపోయాను అనే విషయం గ్రహించిన బాలిక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది.
కాగా బాలిక తన తల్లిదండ్రులతో కలిసి జరిగిన విషయం పై అనంతపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అనంతపురం పోలీసులు... ఇరువర్గాలను పిలిపించి చర్చలు జరిపి బాలికకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రోజు రోజుకి మైనర్ బాలికలు మోసపోతున్న కథనాలు చాలానే తెరమీదకు వస్తున్నాయి... వీటిని నివారించేందుకు మైనర్ బాలికలపై తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు.