ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా డిసెంబర్ 21 న రాష్ట్రం లో పేద,మధ్యతరగతి ప్రజలకు  కొత్త పథకంతో వారి దాతృత్వాన్ని చాటుకోనున్నారు. అలుపెరుగని బాటసారి,సుదీర్ఘ పాదయాత్ర లో పేద,బడుగు, మధ్యతరగతి ప్రజల కష్టాలను దగ్గరగా, స్వయంగా చూసి చలించిన మనసున్న మనిషి జగన్.  ప్రదరణను మెండుగా సంపాదించుకున్న  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట కోసం రాజీలేని పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న తన జన్మదిన సందర్భంగా ఏపీలో అత్యంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే భారీ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. 


పైలట్ ప్రాజెక్ట్ గా ప.గో. జిల్లాలో అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఆ తర్వాత ప్రతి నెల ఒక్కో జిల్లాకు పెంచుతామని హామీ ఇచ్చారు.ఈ క్రమంలో జనవరి 1 నుంచి 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చుతామన్నారు.డిసెంబర్ 21న అందరికీ కొత్తగా వైఎస్ ఆర్  ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన హెల్త్ డేటా అందులో ఉంటుంది. ఆ కార్డుతో ఏ ఆస్పత్రికి వెళ్లినా.. వారి అనారోగ్య సమస్యల డేటా మొత్తం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి సమూలంగా మార్చేస్తున్నట్టు సీఎం తెలిపారు.




కేవలం ఏపీలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైవంటి మహా నగరాల్లోని  ప్రైవేట్ ఆస్పత్రులను కూడా వైద్య సేవలు పొందేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆసుపత్రులన్ని ఆరోగ్య  పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1000 వ్యాధులకు చికిత్స అందిస్తున్నారని, వాటి సంఖ్య 2వేలకు పెంచుతామని సీఎం జగన్ తెలియజేశారు.డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: